CCTV Ban: కీలక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం.. ఆ సీసీటీవీలు బంద్.. ఏప్రిల్ 1 నుంచి అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనీస్ సీసీటీవీ కెమెరాలపై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత దృష్ట్యా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ‘మేడ్ ఇన్ చైనా’ కెమెరాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించబోతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో హెక్ విషన్ (Hikvision), దాహువా (Dahua), టీపీ-లింక్ (TP-Link) వంటి చైనా కంపెనీల హవా నడుస్తోంది. అయితే.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త సర్టిఫికేషన్ నిబంధనల ప్రకారం.. ఇంటర్నెట్తో అనుసంధానమయ్యే ఈ చైనా కంపెనీల నిఘా పరికరాల అమ్మకాలను భారత్లో నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ‘స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్’ (STQC) అనుమతి ఉన్న కెమెరాలను మాత్రమే ఇకపై దేశంలో విక్రయించాల్సి ఉంటుంది.
ఎందుకు ఈ నిషేధం..?
Also Read
- RBI New Currency Notes: ఆర్బీఐ సంచలన ప్లాన్..? పాత కరెన్సీ నోట్లు బ్యాన్..!?
- Explainer: చనిపోయిన తర్వాత భారతీయుల ర*క్తాన్ని తాగుతున్నారు.. వెలుగులోకి భయంకర లెక్కలు!
- 5 Big Rule Changes: జూన్ 1 నుంచి భారీ మార్పులు.. ప్రతి ఇంటిపై ప్రభావం..!
- Loans: లోన్లు ఇవ్వడంలో పురుషుల కంటే మహిళలకే బ్యాంకుల ప్రాధాన్యం..! ఎందుకిలా జరుగుతోంది?
నిఘా పరికరాలు అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తాయి. విమానాశ్రయాలు, ప్రభుత్వ భవనాలు, రవాణా కేంద్రాలు వంటి కీలక ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ క్రమంలో చైనా కెమెరాల ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భారత భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ కెమెరాల్లో రహస్యంగా ‘బ్యాక్ డోర్’ యాక్సెస్ ఉండే అవకాశం ఉందని, దీని ద్వారా సేకరించిన సమాచారం విదేశీ సర్వర్లకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్షణ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో చైనా కెమెరాలను వాడటం వల్ల మన వ్యూహాత్మక సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సర్వైలెన్స్ మార్కెట్లలో ఒకటి. తాజా నిర్ణయం వల్ల చైనా కంపెనీలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉండగా.. భారతీయ తయారీదారులకు ఇది పెద్ద అవకాశంగా మారనుంది. తద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరగనుంది. మొత్తానికి.. డేటా భద్రతే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ , రక్షణ రంగాల్లో పెను మార్పులకు దారితీయనుంది.
తాజావార్తలు
-
RBI New Currency Notes: ఆర్బీఐ సంచలన ప్లాన్..? పాత కరెన్సీ నోట్లు బ్యాన్..!?
-
Explainer: చనిపోయిన తర్వాత భారతీయుల ర*క్తాన్ని తాగుతున్నారు.. వెలుగులోకి భయంకర లెక్కలు!
-
Peddi Team Takes : ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై ‘పెద్ది’ టీమ్ లీగల్ యాక్షన్ స్టార్ట్
-
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP).. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ..!
-
Vaibhav vs Kohli: 2016లో విరాట్ కోహ్లీ, 2026లో వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప..!
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!