మార్కెట్లోకి రోజుకో కొత్త వాహనం రోడ్డెక్కుతున్నది. హోండా మోటార్స్ కంపెనీ ఇండియాలో ఇప్పటికే అనేక వాహనాలను తీసుకొచ్చింది. సామాన్యులకు అందుబాటులో ఉండే వాహనాలతో పాటు లగ్జరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లగ్జరీ మోడల్స్లో హోండా సీబీ 500 ఎక్స్ బైన్ను 2021 మార్చి నెలలో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 6 లక్షలకు పైమాటే. అయితే, ఇటీవలే హోండా కంపెనీ ఈ సీబీ 500 ఎక్స్ మోడల్లో మార్పులు చేసి ఇటీవలే యూరప్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ బైక్ అందర్నీ ఆకట్టుకుంటుండటంతో త్వరలోనే ఇండియా మార్కెట్లో కూడా ఈ బైక్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read: Nandamuri Balakrishna: నేను సీఎంని కలవను.. నాకావసరం కూడా లేదు
ఈ కొత్త మోడల్ భారత్ మార్కెట్లోకి రాబోతున్న తరుణంలో పాత మోడల్ సీబీ 500 ఎక్స్ ధరపై రూ. 1.08 లక్షల తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈ బైక్ ప్రస్తుతం రూ. 5.79 లక్షలకు అందుబాటులో ఉన్నది. ఆకట్టుకునే మోడల్లో ఉన్న సీబీ 500 ఎక్స్ బైక్లపై దేశంలోని యువత ఆసక్తి చూపుతున్నారు. కాగా ఇప్పుడు లక్ష రూపాయల వరకు తగ్గింపు ఉండటంతో మరిన్ని బైక్లు సేల్ అయ్యే అవకాశం ఉందని హోండా బైక్స్ తెలియజేసింది.