HDFC APK File Scam: ఏపీకే ఫైల్స్తో స్కామ్.. హెచ్డీఎఫ్సీ సీరియస్ వార్నింగ్!
- ఏపీకే ఫైల్స్తో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు..
- ఏపీకే ఫైల్స్ను వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవద్దని వెల్లడి..
- సైబర్ స్కామ్ జరిగితే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయడండి: హెచ్డీఎఫ్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HDFC APK File Scam: సైబర్ నేరగాళ్లు ఈ మధ్యకాలంలో ఏపీకే ఫైల్స్తో పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. వీటి సహాయంతో స్మార్ట్ఫోన్లను తమ కంట్రోల్లోకి తెచ్చుకుని డబ్బును దోచేస్తున్నారు. అయితే, ఈ తరహా ఫైల్స్ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తాజాగా హెచ్చరించింది. మీ మొబైల్కు వచ్చే ఎలాంటి ఏపీకే ఫైల్స్నూ డౌన్లోడ్ చేసుకోవద్దని పేర్కొనింది. కస్టమర్లు దయచేసి థర్డ్ పార్టీ యాప్స్ వాడొద్దని, ఏవైనా లింక్లు వచ్చినపుడు పంపిన వ్యక్తి నమ్మదగిన వారేనా? కాదా అని చెక్ చేసుకోవాలని వెల్లడించింది.
Read Also: Chain Snatching: చైన్ స్నాచింగ్ గ్యాంగుల బెడద.. ఏకంగా కాంగ్రెస్ ఎంపీ చైన్ కొట్టేశారు..
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ఇక, సైబర్ నేరస్థులు తాము బ్యాంకు ఎంప్లాయ్స్, ప్రభుత్వ అధికారులం అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అని హెచ్డీఎఫ్సీ తెలిపింది. ఆ తర్వాత ఓ ఏపీకే ఫైల్ను మీ ఫోన్ లోకి పంపించి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని చెబుతున్నారని పేర్కొనింది. అయితే, ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసుకుంటే బాధితుల మొబైల్ ఫోన్పై ఈ మోసగాళ్లకు పూర్తి నియంత్రణ దక్కుతుందన్నారు. దీంతో మీ ప్రమేయం లేకుండానే మీ బ్యాంక్ ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా మీ ఫోన్కు వచ్చే కాల్స్, మెసేజ్లను వేరే డివైజ్కు ఈ సైబర్ నేరగాళ్లు మళ్లించగలరు.. ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలపైనా వారికి పూర్తి అధికారం లభిస్తుంది.. కాబట్టి, అప్రమత్తంగా ఉండండి అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చెప్పుకొచ్చింది. ఏవైనా సైబర్ స్కామ్ జరిగితే సైబర్ క్రైమ్ పోర్టల్ https://sancharsaathi.gov.in/ లో ఫిర్యాదు చేయాలని తెలియజేసింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!