Gold and Silver Prices: ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో కొండెక్కుతున్న బంగారం, వెండి ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices: మధ్యప్రాచ్యంలో ముదిరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. యుద్ధం తీవ్రతరం కావడంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుంచి తమ డబ్బును బయటికి తీసుకొని, బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. అనిశ్చిత సమయాల్లో బంగారం ఎప్పుడూ ‘సేఫ్ హెవెన్’గా పరిగణించబడుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో బంగారం, వెండి ధరలు ఎలా మారబోతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Pakistan vs Sri Lanka: శ్రీలంక చేతిలో పాక్ జుట్టు.. ఈ తప్పు చేస్తే ఇంటికే!
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,61,720 వద్ద ఉంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, త్వరలోనే తులాం బంగారం ధర రూ.2 లక్షల మార్కును చేరుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో బంగారంతో పాటు వెండి కూడా రికార్డు స్థాయికి చేరుకుంటోంది. పారిశ్రామిక డిమాండ్, సరఫరా గొలుసులో అంతరాయాల కారణంగా వెండి ధరలు గణనీయంగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద ట్రేడవుతోంది. కేవలం శుక్రవారం రోజే కిలో వెండిపై రూ.16,000 వరకు పెరగడం మార్కెట్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది.
సామాన్యుడిపై భారం..
ఈ ధరల పెరుగుదల కేవలం పెట్టుబడిదారులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా కష్టాలను తెచ్చిపెడుతోందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయంలో ఆభరణాలు కొనడం సామాన్యుల బడ్జెట్ను తలకిందులు చేస్తోందని చెబుతున్నారు. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది, కాబట్టి నిపుణులు పెట్టుబడిదారులకు పలు సూచనలు చేస్తున్నారు. భారీ మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా, ధరలు కొంచెం తగ్గినప్పుడు చిన్నచిన్న మొత్తాల్లో బంగారాన్ని కొనడం ఉత్తమం అని చెబుతున్నారు. యుద్ధ పరిస్థితిపై స్పష్టత వచ్చే వరకు మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుందని, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
READ ALSO: Trump Bans Anthropic: AI ప్రపంచంలో సంచలనం సృష్టించిన ట్రంప్ .. అమెరికాలో ‘ఆంత్రోపిక్’ క్లోజ్!
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!