Gold Price: పసిడి ప్రియులకు షాక్.. కొండెక్కిన ధరలు.. ఎంతంటే..!
- పసిడి ప్రియులకు షాక్
- కొండెక్కిన ధరలు
- తొలిసారి రూ. 83,000 దాటిన బంగారం ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. అమాంతంగా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజనల్లు నడుస్తున్నాయి. ఇప్పటికే అధిక ధరలతో కొనుగోలు చేయలేకపోతున్నారు. అలాంటిది శుక్రవారం బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. తొలిసారి బంగారం ధర రూ. 83,000 దాటింది. శుక్రవారం ఢిల్లీలో తొలిసారిగా రూ.200 పెరిగి 10 గ్రాములకు రూ.83,000 మార్కును అధిగమించింది. 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం రూ.200 పెరిగి 10 గ్రాములకు రూ.83,100 తాజా జీవితకాల గరిష్ట స్థాయిని తాకిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. గురువారం బంగారం 10 గ్రాములకు రూ.82,900 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Sewing Machines: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్లు!.. ఇలా అప్లై చేసుకోండి!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారానికి భారీగా డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.83 వేలు దాటింది. ఈ మార్కు దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం. అటు వెండి సైతం కిలోకు రూ.500 మేర పెరిగింది. ట్రేడింగ్లో రూ.93,500గా ఉన్న వెండి కిలో తాజాగా రూ.94 వేల మార్కుకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ టారిఫ్ల విషయంలో ఎలా వ్యవహరిస్తారనే అంశంతో అనిశ్చితి కొనసాగుతోంది. అయితే ముందు.., ముందు ధరలు మరింత పైకి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రూ.లక్ష వరకు పెరిగే ఛాన్సు ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి: Delhi Metro: హస్తిన వాసులకు అలర్ట్.. 26న ఉ.3 గంటల నుంచే మెట్రో సేవలు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!