నిన్నామొన్నటి దాకా బంగారం, వెండి ధరల గురించి అన్ని షాకింగ్ న్యూస్లే వినాల్సి వచ్చేది. ప్రతిరోజు వెండి, బంగారం ధరలు విశ్వరూపం సృష్టిస్తున్నాయని మాట్లాడుకుని దుస్థితి తలెత్తింది. ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా ఆభరణాల ధరలు దిగొస్తున్నాయి. ఏ ప్రభావమో తెలియదుగానీ.. ఈరోజు తులం గోల్డ్పై రూ.9,050 తగ్గగా.. కిలో వెండిపై ఏకంగా రూ.50,000 తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ.3,00,000 దగ్గర అమ్ముడవుతోంది.
తులం గోల్డ్పై రూ.9,050 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.8,300 తగ్గడంతో రూ.1,38,900 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.6,790 తగ్గడంతో రూ.1,13,650 దగ్గర ట్రేడ్ అవుతోంది.
హమ్మయ్య వెండి బాగా శాంతించింది. కిలో వెండిపై ఏకంగా రూ.50,000 తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,00, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కూడా కిలో వెండి ధర రూ.3,00, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
