NTV Telugu Site icon

మగువలకు బ్యాడ్ న్యూస్: భారీగా పెరిగిన పుత్తడి ధరలు 

గ‌తేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా స‌మ్మ‌ర్‌లో క‌రోనా కేసుల‌తో పాటుగా బంగారం ధ‌ర‌లు కూడా పెర‌గ‌డం మొద‌లుపెట్టాయి.  ఈరోజు కూడా బంగారం ధ‌ర‌లు మ‌రింత‌గా పెరిగాయి.  పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.240 పెరిగి రూ.45,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.270 పెరిగి రూ.49,260కి చేరింది.  దేశీయంగా అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌లు జరుగుతుండ‌టంతో చాలామంది బంగారంపై పెట్టుబ‌డులు పెడుతుండ‌టంతో ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి.