GIFT City: సింగపూర్, దుబాయ్లకు ధీటుగా.. మన దేశంలోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ వేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ (GIFT City) అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఎలా ఎదుగుతోంది, పెట్టుబడిదారులకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇన్నాళ్లూ విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే భారతీయులు సింగపూర్ లేదా దుబాయ్ వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. అక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఎంతోమంది మధ్యవర్తులు, కఠినమైన నిబంధనలు, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనిగా ఉండేది. కానీ ఇప్పుడు మన దేశంలోనే ఉన్న ‘గిఫ్ట్ సిటీ’ ఈ పరిస్థితిని మారుస్తోంది. విదేశీయులు లేదా ఎన్ఆర్ఐలు (NRIs) భారత్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎదురయ్యే పన్నులు, కరెన్సీ మార్పిడి వంటి ఇబ్బందులను కూడా ఇది తొలగిస్తోంది.
ఒకే చోట అన్ని అనుమతులు..
గిఫ్ట్ సిటీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ , స్టాక్ మార్కెట్ వంటి అన్ని విభాగాలకు IFSCA అనే ఒకే ఒక సంస్థ నిబంధనలను పర్యవేక్షిస్తుంది. దీనివల్ల పెట్టుబడిదారులు వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పనులు వేగంగా పూర్తవుతాయి. ఇది సింగపూర్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
ఎన్ఆర్ఐలకు సులభమైన మార్గం..
భారతదేశ చట్టాల ప్రకారం గిఫ్ట్ సిటీని ఒక ‘విదేశీ భూభాగం’గా పరిగణిస్తారు. దీనివల్ల ఎన్ఆర్ఐలు తమ వద్ద ఉన్న డాలర్లు లేదా యూరోలను రూపాయిల్లోకి మార్చకుండానే నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే తమకు వచ్చిన లాభాలను తిరిగి విదేశాలకు తీసుకెళ్లడం కూడా చాలా సులభం. భారత్కు రాకుండానే వీడియో కేవైసీ (Video KYC) ద్వారా ఖాతాలు తెరిచే సదుపాయం కూడా ఉంది. పన్నుల విషయంలో కూడా ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పించింది.
సాధారణంగా విదేశాల్లో పెట్టుబడి పెట్టాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. గిఫ్ట్ సిటీ ద్వారా గ్లోబల్ స్టాక్స్ , ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినంత సులభంగా మారుతోంది. ఇది క్రమంగా పెట్టుబడిదారుల అలవాట్లను మారుస్తూ.. అంతర్జాతీయ మార్కెట్ను మనకు దగ్గర చేస్తోంది.
వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక హబ్..
సెప్టెంబర్ 2025 నాటికి ఉన్న లెక్కల ప్రకారం.. గిఫ్ట్ సిటీలోని బ్యాంకింగ్ ఆస్తుల విలువ 100 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇప్పటికే ఇక్కడ 1,000 కంటే ఎక్కువ సంస్థలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి .. 20,000 మందికి పైగా నిపుణులు ఇక్కడ పని చేస్తున్నారు. ఇది ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రంగా ఎంత వేగంగా ఎదుగుతుందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.
గిఫ్ట్ సిటీ ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉన్నప్పటికీ, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, నిబంధనలలో ఉన్న స్పష్టత పెట్టుబడిదారులకు నమ్మకాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ చేరితే, భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడం ఖాయం.
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!