Startup Journey: సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి… దోశల వ్యాపారంలోకి వచ్చిన యువకుడు
- స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్న యువత
- జర్మనీలోని ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్లో ఉద్యోగాన్ని వదిలేసిన మోహన్
- తన స్నేహితులతో కలిసి “దోసమా” అనే స్టార్టప్ను ప్రారంభించిన మోహన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యువత లక్షల రూపాయల జీతాలు వచ్చే ఉద్యోగాలను వదిలేసి, స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. టీ స్టాళ్లు, కాఫీ షాపులు, టిఫిన్ సెంటర్లు వంటి చిన్న వ్యాపారాల నుంచి స్టార్టప్ల వరకు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారిలో ఒకరు మోహన్. జర్మనీలోని ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్లో ఉద్యోగాన్ని వదిలేసి దోశల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఈ యువకుడి కథ ఇప్పుడు అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, మోహన్ పారిస్లో స్కాలర్షిప్తో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం జర్మనీలో ఇంటెల్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి అగ్రశ్రేణి కంపెనీల్లో లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాల్లో పని చేశాడు. అయితే ఈ ఉద్యోగాలు అతనికి అంతగా సంతృప్తిని ఇవ్వలేదు. తనలోని ప్యాషన్ను అనుసరించాలనే ఆలోచనతో 2023లో తన స్నేహితులతో కలిసి “దోసమా” అనే స్టార్టప్ను ప్రారంభించాడు.
Also Read
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
ఇంటెల్ వంటి భారీ టెక్ కంపెనీలోని ఉద్యోగాన్ని వదిలేసి దోశల వ్యాపారం ప్రారంభించడాన్ని చూసి మొదట్లో చాలామంది ఇది ఒక “విచిత్రమైన నిర్ణయం” అంటూ విమర్శించారు. కానీ మోహన్ మాత్రం దీనిని తన కలగా భావించి, విజయం సాధించేందుకు అహర్నిశలు కృషి చేశాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. “అమెరికా బర్గర్లు, ఇటలీ పిజ్జాలు భారత్కు వచ్చాయి కదా… మరి భారతీయ వంటకాలు పారిస్కు ఎందుకు వెళ్లకూడదు?” అనే ఆలోచనతో యూరప్లో “దోసమా” ఔట్లెట్లను ప్రారంభించాడు.
ఈరోజు “దోసమా” పారిస్ నుంచి లండన్ వరకు విస్తరించి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రాండ్గా మారింది. భారతీయ ఆహార సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా మోహన్ ముందుకు సాగుతున్నాడు. డిసెంబర్ 2025లో పుణేలోని ఎఫ్సీ రోడ్డుపై “దోసమా” బ్రాంచ్ ప్రారంభం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం మోహన్ ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారతదేశపు ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడని అనేక మంది అతన్ని అభినందిస్తున్నారు.
తాజావార్తలు
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!