Elon Musk Twitter Deal: ముదురుతున్న వివాదం.. ట్విట్టర్ పై మస్క్ కౌంటర్ దావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్లా అధినేత , ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పై ఎదురుదాడికి దిగారు. మస్క్, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మధ్య లీగల్ వార్ మరింత ముదురుతోంది. అయితే.. ట్విట్టర్ తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి టెస్లా అధినేతపై దావా వేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. తాజాగా ట్విట్టర్ దావాను సవాల్ చేస్తూ మస్క్ కూడా కౌంటర్ దావా వేశారు. మస్క్ పై ట్విట్టర్ వేసిన దావాపై ఈ ఏడాది అక్టోబరులో విచారణ జరపనున్నట్లు డెలావర్ కోర్టు ఆదేశాలు వెలువరించిన కొద్ది గంటలకే మస్క్ ఎదురు దాడికి దిగాడు. మస్క్ కూడా సవాల్ చేస్తూ ట్విట్టర్ పై దావా వేయడం చర్చనీయాంశంగా మారింది.
read also: Thirty Five Years for Bala Krishna Ramu Movie : బాలకృష్ణ ‘రాము’కు 35 ఏళ్ళు
Also Read
- Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
- Tata Sons AGM: టాటా సన్స్ చరిత్రలో తొలిసారి.. AGM వాయిదా! అసలేం జరుగుతోంది?
- Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
- Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.50 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ వెల్లడించారు. దీంతో.. ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. మస్క్ షరతులకు లోబడి ఒప్పందాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డెలావర్లోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈనేపథ్యంలో.. ఒప్పందంలో అంగీకరించినట్లుగా ఒక్కో షేరును 54.20 డాలర్ల వద్ద కొనుగోలు చేసేలా ఆదేశించాలని కోరింది. దీంతో.. ఈ పిటిషన్ను నిన్న స్వీకరించిన డెలావర్ కోర్టు.. అక్టోబరు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు దీనిపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. అయితే.. మస్క్ సామాజిక మాధ్యమంపై కౌంటర్ దావా వేసిన.. మస్క్ వేసిన దావాపై ట్విట్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ట్విట్టర్ షేరు విలువ 41.61 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. అయితే.. మస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ట్విట్టర్ షేర్లు భారీగా పతనమయ్యాయని.. అయితే షేర్లు మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!