Trump Tariffs: ట్రంప్కు పిచ్చి పీక్స్కు చేరిందా? శత్రుదేశం చైనాకు సాయం.. మిత్ర దేశం భారత్కు పోటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump tariffs India-China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు పిచ్చి పీక్స్కు చేరుకుంది. అదేంటి ఒక్కసారిగా అలా అన్నారు? అని ఆశ్చర్య పోకండి. ఈ వార్త చదివిన తరువాత మొత్తం మీకే అర్థమవుతుంది. వాస్తవానికి అమెరికాకు చైనా అంటే ముందు నుంచే పడదు. చైనా పేరు వింటేనే ఎక్కడో కాలుతుంది. మరోవైపు.. భారత్ అమెరికాకు మిత్ర దేశం. ఇరు దేశాల మధ్య మంచి సఖ్యత ఉంది. కానీ.. ఈ రెండు దేశాలపై ట్రంప్ మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. భారత్పై 50% శాతం సుంకాలు విధిస్తూ ఉత్తర్వులపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెలలో ఈ అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. మిత్ర దేశం అంటూనే వెన్నుపోటు పొడిచారు ట్రంప్.. రష్యా నుంచి చమురు దిగుమతి కారణంగా సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.
READ MORE: Trivikram Srinivas: నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించలేను అన్నారు!
Also Read
- ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
- RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
కానీ.. శత్రు దేశం చైనా పై మాత్ర దయ చూపుతున్నారు. చైనాపై అదనపు సుంకం విధించే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల పాటు వాయిదా వేశారు. అమెరికా-చైనా సుంకాల గడువును నవంబర్ 9 వరకు పొడిగించినట్లు ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. ప్రస్తుతం చైనాపై అమెరికా 30 శాతం సుంకం విధించింది. ఏప్రిల్లో చైనాపై 245 శాతం వరకు సుంకం విధిస్తామని అమెరికా బెదిరించింది. దీనికి చైనా స్పందిస్తూ అమెరికాపై 125 శాతం సుంకం విధిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో అమెరికా చైనా పట్ల దయ చూపింది. అయితే చైనాతో అమెరికా మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాకు విధించిన సుంకాల విషయంలో అగ్ర రాజ్యం వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైనాపై ప్రతీకార సుంకాలు విధించాలా? వద్దా? అన్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ స్పష్టం చేశారు.
ఇంకో అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే.. రష్యా నుంచి భారత్ అధికంగా చమురును కొనుగోలు చేస్తుందని ట్రంప్ వాదించారు. అయితే.. డిసెంబర్ 2022, జూలై 2025 మధ్య రష్యన్ చమురును చైనా (47%), భారతదేశం (38%), EU దేశాలు + టర్కీ (6%) చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. చైనా అత్యధికంగా కొనుగోలు చేస్తోంది. భారత్ మాత్రమే అత్యధికంగా కొనుగోలు చేస్తోందనే ట్రంప్ వాదన పూర్తిగా తప్పు. భారత్ పరిమితుల్లో వ్యాపారం చేస్తోంది.. కానీ ప్రపంచ స్థాయిలో ఇంత పెద్ద కపటత్వం ఎందుకు..? లేనిది ఉన్నట్లుగా ఎందుకు కల్పిస్తున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమువుతున్నాయి. వాస్తవానికి, ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న దేశాలు భారత్ను ఇష్టపడవు. ఎందుకంటే.. భారత్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుందని భయం. అందుకే ఇతర దేశాలు నిశ్శబ్దంగా రష్యాతో వ్యాపారం చేస్తున్నప్పటికీ.. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న భారత్ను మాత్రమే నిందిస్తున్నారు. ఇది నైతికతకు సంబంధించిన విషయం కాదని.. రాజకీయంగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తే ట్రంప్కు పిచ్చి పీక్స్కు చేరింది అనిపిస్తోంది కదూ..!
తాజావార్తలు
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
-
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
ట్రెండింగ్
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!