Trump Tariffs: ట్రంప్కు పిచ్చి పీక్స్కు చేరిందా? శత్రుదేశం చైనాకు సాయం.. మిత్ర దేశం భారత్కు పోటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump tariffs India-China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు పిచ్చి పీక్స్కు చేరుకుంది. అదేంటి ఒక్కసారిగా అలా అన్నారు? అని ఆశ్చర్య పోకండి. ఈ వార్త చదివిన తరువాత మొత్తం మీకే అర్థమవుతుంది. వాస్తవానికి అమెరికాకు చైనా అంటే ముందు నుంచే పడదు. చైనా పేరు వింటేనే ఎక్కడో కాలుతుంది. మరోవైపు.. భారత్ అమెరికాకు మిత్ర దేశం. ఇరు దేశాల మధ్య మంచి సఖ్యత ఉంది. కానీ.. ఈ రెండు దేశాలపై ట్రంప్ మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. భారత్పై 50% శాతం సుంకాలు విధిస్తూ ఉత్తర్వులపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెలలో ఈ అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. మిత్ర దేశం అంటూనే వెన్నుపోటు పొడిచారు ట్రంప్.. రష్యా నుంచి చమురు దిగుమతి కారణంగా సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.
READ MORE: Trivikram Srinivas: నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించలేను అన్నారు!
Also Read
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
- JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
కానీ.. శత్రు దేశం చైనా పై మాత్ర దయ చూపుతున్నారు. చైనాపై అదనపు సుంకం విధించే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల పాటు వాయిదా వేశారు. అమెరికా-చైనా సుంకాల గడువును నవంబర్ 9 వరకు పొడిగించినట్లు ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. ప్రస్తుతం చైనాపై అమెరికా 30 శాతం సుంకం విధించింది. ఏప్రిల్లో చైనాపై 245 శాతం వరకు సుంకం విధిస్తామని అమెరికా బెదిరించింది. దీనికి చైనా స్పందిస్తూ అమెరికాపై 125 శాతం సుంకం విధిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో అమెరికా చైనా పట్ల దయ చూపింది. అయితే చైనాతో అమెరికా మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాకు విధించిన సుంకాల విషయంలో అగ్ర రాజ్యం వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైనాపై ప్రతీకార సుంకాలు విధించాలా? వద్దా? అన్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ స్పష్టం చేశారు.
ఇంకో అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే.. రష్యా నుంచి భారత్ అధికంగా చమురును కొనుగోలు చేస్తుందని ట్రంప్ వాదించారు. అయితే.. డిసెంబర్ 2022, జూలై 2025 మధ్య రష్యన్ చమురును చైనా (47%), భారతదేశం (38%), EU దేశాలు + టర్కీ (6%) చొప్పున కొనుగోలు చేస్తున్నాయి. భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. చైనా అత్యధికంగా కొనుగోలు చేస్తోంది. భారత్ మాత్రమే అత్యధికంగా కొనుగోలు చేస్తోందనే ట్రంప్ వాదన పూర్తిగా తప్పు. భారత్ పరిమితుల్లో వ్యాపారం చేస్తోంది.. కానీ ప్రపంచ స్థాయిలో ఇంత పెద్ద కపటత్వం ఎందుకు..? లేనిది ఉన్నట్లుగా ఎందుకు కల్పిస్తున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమువుతున్నాయి. వాస్తవానికి, ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న దేశాలు భారత్ను ఇష్టపడవు. ఎందుకంటే.. భారత్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుందని భయం. అందుకే ఇతర దేశాలు నిశ్శబ్దంగా రష్యాతో వ్యాపారం చేస్తున్నప్పటికీ.. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న భారత్ను మాత్రమే నిందిస్తున్నారు. ఇది నైతికతకు సంబంధించిన విషయం కాదని.. రాజకీయంగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తే ట్రంప్కు పిచ్చి పీక్స్కు చేరింది అనిపిస్తోంది కదూ..!
తాజావార్తలు
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!