Cabinet Decisions: కేంద్ర కేబినెట్ నిర్ణయాలు.. ఏపీ సహా ఆ రెండు రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ల తయారీ ప్రాజెక్టు!
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ఏపీ సహా ఒడిశా, పంజాబ్ లో కొత్త సమీ కండక్టర్ యూనిట్లు..
- 4 సమీకండక్టర్ యూనిట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
- లక్నోలో మెట్రోకు కేంద్ర కేబినెట్ ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు (ఆగస్టు 12న) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, దేశంలో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ ఊపందుకుంటున్న వేళ తాజా నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది. ఇప్పటికే దేశంలో ఆరు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నాలుగు కొత్త ప్రాజెక్టులతో ఈ సంఖ్య 10కి చేరిందని చెప్పాలి. కాగా, 2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఇవి కీలకంగా వ్యవహరించబోతున్నాయి.
Read Also: Heavy Rains : అలుగులు పోస్తున్న పాలేరు, వైరా జలాశయాలు
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
ఇక, ఎలక్ట్రానిక్ తయారీ ఎకోసిస్టమ్కు ఉత్ప్రేరకంగా మరి, అనేక ఉద్యోగాల కల్పనకు సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ ఉపయోగపడుతుంది. టెలికాం, డేటా సెంటర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్లకు మరింత డిమాండ్ పెరుగుతుండటంతో.. కొత్తగా ఆమోదించిన ఈ నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు దేశంలో సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబన సాధించడంలో కీలకపాత్ర పోషించబోతున్నాయి. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఇవి పెద్ద మైలురాయిగా నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది.
Read Also: Spirit : అక్కడున్నది ప్రభాస్.. సందీప్ రెడ్డి అంత ధైర్యం చేస్తాడా..?
అయితే, దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పంజాబ్లో సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా రూ.4,594 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు. అలాగే, పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసేలా లక్నో మెట్రో ఫేజ్ 1బీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని రూ.5,801 కోట్లతో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇక, అరుణాచల్ ప్రదేశ్లో 700 మెగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు మోడీ కేబినెట్ లో ఆమోదం లభించింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!