Cabinet Decisions: కేంద్ర కేబినెట్ నిర్ణయాలు.. ఏపీ సహా ఆ రెండు రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ల తయారీ ప్రాజెక్టు!
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ఏపీ సహా ఒడిశా, పంజాబ్ లో కొత్త సమీ కండక్టర్ యూనిట్లు..
- 4 సమీకండక్టర్ యూనిట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
- లక్నోలో మెట్రోకు కేంద్ర కేబినెట్ ఆమోదం..
ఈ రోజు (ఆగస్టు 12న) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, దేశంలో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ ఊపందుకుంటున్న వేళ తాజా నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది. ఇప్పటికే దేశంలో ఆరు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నాలుగు కొత్త ప్రాజెక్టులతో ఈ సంఖ్య 10కి చేరిందని చెప్పాలి. కాగా, 2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఇవి కీలకంగా వ్యవహరించబోతున్నాయి.
Read Also: Heavy Rains : అలుగులు పోస్తున్న పాలేరు, వైరా జలాశయాలు
Also Read
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
ఇక, ఎలక్ట్రానిక్ తయారీ ఎకోసిస్టమ్కు ఉత్ప్రేరకంగా మరి, అనేక ఉద్యోగాల కల్పనకు సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ ఉపయోగపడుతుంది. టెలికాం, డేటా సెంటర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్లకు మరింత డిమాండ్ పెరుగుతుండటంతో.. కొత్తగా ఆమోదించిన ఈ నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు దేశంలో సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబన సాధించడంలో కీలకపాత్ర పోషించబోతున్నాయి. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఇవి పెద్ద మైలురాయిగా నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది.
Read Also: Spirit : అక్కడున్నది ప్రభాస్.. సందీప్ రెడ్డి అంత ధైర్యం చేస్తాడా..?
అయితే, దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పంజాబ్లో సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా రూ.4,594 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు. అలాగే, పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసేలా లక్నో మెట్రో ఫేజ్ 1బీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని రూ.5,801 కోట్లతో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇక, అరుణాచల్ ప్రదేశ్లో 700 మెగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు మోడీ కేబినెట్ లో ఆమోదం లభించింది.
తాజావార్తలు
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
-
Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
-
AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!