Bank Closed: బిగ్ షాక్.. ఇండియాలో ఆ బ్యాంక్ పూర్తిగా క్లోజ్..
- కీలక నిర్ణయం తీసుకున్న దోహా బ్యాంక్..
- ఇండియాలో తన రెండు బ్రాంచ్లను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖతార్కు చెందిన ప్రముఖ బ్యాంకు ‘దోహా బ్యాంక్’ (Doha Bank) భారత్లో తన కార్యకలాపాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. పదేళ్లకు పైగా మన దేశంలో సేవలు అందించిన ఈ బ్యాంకు, ఇప్పుడు తన రెండు శాఖలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దోహా బ్యాంకు తన వ్యాపార విధానంలో మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్లో ఉన్న తన పూర్తి స్థాయి బ్యాంకు శాఖలను మూసివేసి.. కేవలం ఒక ‘ప్రతినిధి కార్యాలయం’ (Representative Office)ను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఖతార్లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్నారు. దీనికి సంబంధించి స్థానిక స్టాక్ ఎక్స్ఛేంజీకి కూడా సమాచారం అందించారు.
Also Read
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
- PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
- Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
నిబంధనల ప్రకారం ఉపసంహరణ..
భారతదేశంలోని బ్యాంకు కార్యకలాపాల నుంచి క్రమంగా తప్పుకోవడానికి బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే.. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతులు వచ్చిన తర్వాతే శాఖల మూసివేత ప్రక్రియ పూర్తవుతుంది.
భారత్లో దోహా బ్యాంక్ ప్రస్థానం..
దోహా బ్యాంక్ జూన్ 2014లో భారతదేశంలో తన సేవలను ప్రారంభించింది. మొదట ముంబైలో తన మొదటి శాఖను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కేరళలోని కొచ్చిలో మరొక శాఖను తెరిచింది. గల్ఫ్ దేశాలకు, భారత్కు మధ్య జరిగే నగదు బదిలీలు, పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకుని తన వ్యాపారాన్ని విస్తరించాలని అప్పట్లో ఈ బ్యాంకు భావించింది.
2016 ప్రాంతంలో ఈ బ్యాంకు భారత్లో ఒక అనుబంధ సంస్థను (Subsidiary) ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతుందని వార్తలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు అనూహ్యంగా తన శాఖలను మూసివేసి కేవలం ప్రతినిధి కార్యాలయానికే పరిమితం కావడం గమనార్హం.
ప్రతినిధి కార్యాలయం అంటే ఏమిటి..?
ప్రతినిధి కార్యాలయం అనేది నేరుగా బ్యాంకింగ్ లావాదేవీలు (డబ్బులు జమ చేయడం, విత్ డ్రా చేయడం వంటివి) చేయదు. ఇది కేవలం ఖతార్లోని ప్రధాన బ్యాంకుకు, భారతీయ కస్టమర్లకు మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. వ్యాపార అవకాశాలను వెతకడం, సమాచారాన్ని పంచుకోవడం వంటి పనులకు మాత్రమే ఇది పరిమితం అవుతుంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్షీట్
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!