Commercial Gas: గుడ్ న్యూస్.. పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరా వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ప్రభావం భారతీయ మార్కెట్పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ (LPG) సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ సంక్షోభం నుంచి పారిశ్రామిక రంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
సరఫరా కోటా పెంపుదల..
Also Read
- SEBI F&O New Rules: ఎఫ్అండ్ఓ (F&O) ట్రేడింగ్ను మార్చబోతున్న సెబీ కొత్త రూల్.. అసలు మ్యాటర్ ఇదే!
- Satish Sanpal: 8వ తరగతి డ్రాపౌట్ నుంచి వేల కోట్ల అధిపతిగా.. భార్యకు 40 కిలోల బంగారం గిఫ్ట్తో వైరల్గా మారిన సక్సెస్ స్టోరీ!
- Gold Loan Surge : సంక్షోభ సమయంలో గోల్డ్ లోన్లవైపు పరుగులు తీస్తున్న సామాన్యులు.. ఎందుకిలా?
- Stock Market: ఢిల్లీ కంటే తక్కువ జనాభా.. కానీ స్టాక్ మార్కెట్లో భారత్నే వెనక్కి నెట్టి ఈ చిన్న దేశం..
గత కొన్ని వారాలుగా కమర్షియల్ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న పరిశ్రమలకు ఊరటనిస్తూ, కేంద్ర పెట్రోలియం శాఖ సరఫరాను 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత వారంలో ఈ సరఫరా కేవలం 50 శాతంగా మాత్రమే ఉండేది. ఇప్పుడు అదనంగా మరో 20 శాతం పెంచడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తి మందగించకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు అధికారిక లేఖలు రాశారు.
కీలక రంగాలకు ప్రాధాన్యత..
సరఫరాను పెంచడమే కాకుండా.. ఆ గ్యాస్ను ఏయే రంగాలకు ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలో కూడా కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే కొన్ని రంగాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అందులో ఉక్కు, ఆటోమొబైల్స్.. వస్త్ర, రసాయన పరిశ్రమలు.. ప్లాస్టిక్ మరియు రంగుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి.
Also Read:Chiranjeevi : మరోమారు సేవాగుణం చాటిన మెగాస్టార్ .. ఎన్టీఆర్ అవార్డు డబ్బు దానం !
ప్రీ-క్రైసిస్ కోటాలో మార్పులు..
సంక్షోభానికి ముందు ఉన్న సాధారణ పరిస్థితులను పునరుద్ధరించే క్రమంలో రాష్ట్రాలకు ఇచ్చే కేటాయింపులను కేంద్రం సవరించింది. గతంలో రాష్ట్రాలకు ఉన్న 40 శాతం కేటాయింపులను ఇప్పుడు 50 శాతానికి పెంచింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని చిన్న , మధ్యతరహా పరిశ్రమల (MSMEs) అవసరాలను తీర్చడానికి అవకాశం కలుగుతుంది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సహజంగానే చమురు ధరలు పెరగడం, దిగుమతులు తగ్గడం వంటివి జరుగుతాయి. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం అధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం పరిస్థితులు కొంత మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో.. ప్రభుత్వం క్రమంగా ఆంక్షలను సడలిస్తూ సరఫరాను సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది పారిశ్రామిక వృద్ధి రేటు పడిపోకుండా కాపాడటంతో పాటు, మార్కెట్లో వస్తువుల ధరలు పెరగకుండా అడ్డుకోవడానికి దోహదపడుతుంది.
తాజావార్తలు
-
CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
-
Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!