Commercial Gas: గుడ్ న్యూస్.. పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరా వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ప్రభావం భారతీయ మార్కెట్పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ (LPG) సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ సంక్షోభం నుంచి పారిశ్రామిక రంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
సరఫరా కోటా పెంపుదల..
Also Read
- Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
గత కొన్ని వారాలుగా కమర్షియల్ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న పరిశ్రమలకు ఊరటనిస్తూ, కేంద్ర పెట్రోలియం శాఖ సరఫరాను 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత వారంలో ఈ సరఫరా కేవలం 50 శాతంగా మాత్రమే ఉండేది. ఇప్పుడు అదనంగా మరో 20 శాతం పెంచడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తి మందగించకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు అధికారిక లేఖలు రాశారు.
కీలక రంగాలకు ప్రాధాన్యత..
సరఫరాను పెంచడమే కాకుండా.. ఆ గ్యాస్ను ఏయే రంగాలకు ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలో కూడా కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే కొన్ని రంగాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అందులో ఉక్కు, ఆటోమొబైల్స్.. వస్త్ర, రసాయన పరిశ్రమలు.. ప్లాస్టిక్ మరియు రంగుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి.
Also Read:Chiranjeevi : మరోమారు సేవాగుణం చాటిన మెగాస్టార్ .. ఎన్టీఆర్ అవార్డు డబ్బు దానం !
ప్రీ-క్రైసిస్ కోటాలో మార్పులు..
సంక్షోభానికి ముందు ఉన్న సాధారణ పరిస్థితులను పునరుద్ధరించే క్రమంలో రాష్ట్రాలకు ఇచ్చే కేటాయింపులను కేంద్రం సవరించింది. గతంలో రాష్ట్రాలకు ఉన్న 40 శాతం కేటాయింపులను ఇప్పుడు 50 శాతానికి పెంచింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని చిన్న , మధ్యతరహా పరిశ్రమల (MSMEs) అవసరాలను తీర్చడానికి అవకాశం కలుగుతుంది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సహజంగానే చమురు ధరలు పెరగడం, దిగుమతులు తగ్గడం వంటివి జరుగుతాయి. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం అధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం పరిస్థితులు కొంత మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో.. ప్రభుత్వం క్రమంగా ఆంక్షలను సడలిస్తూ సరఫరాను సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది పారిశ్రామిక వృద్ధి రేటు పడిపోకుండా కాపాడటంతో పాటు, మార్కెట్లో వస్తువుల ధరలు పెరగకుండా అడ్డుకోవడానికి దోహదపడుతుంది.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!