Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపర్చే వార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపర్చే వార్త వెలువడింది. వాళ్ల వేతనాల సవరణకు సంబంధించి 8వ వేతన సంఘాన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదనేదీ తమవద్ద లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభకు తెలిపింది. 7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరిలో ఏర్పాటుచేయగా ఆ సంఘం సిఫార్సులు 2016 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 8వ వేతన సంఘాన్ని గనక ఏర్పాటుచేస్తే ఆ సంఘం సిఫార్సులు 2026 జనవరి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.
తగ్గిన లాభం
Also Read
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
- RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నికర లాభం 37 శాతం తగ్గింది. జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ 3,801 కోట్ల రూపాయలకే పరిమితమైంది. గతేడాది ఇదే సమయంలో పవర్ గ్రిడ్ నికర లాభం 5,998 కోట్ల రూపాయలు వచ్చింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా ఈ సంస్థ నికర లాభం ఎనిమిదిన్నర శాతం పడిపోయి 4,156 కోట్ల రూపాయలకు తగ్గింది.
TS Constable Prelims Exam: కానిస్టేబుల్ ప్రిలిమ్స్పరీక్ష వాయిదా.. ఎప్పుడంటే?
భరోసా ఇవ్వండి
అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను డాలర్లకు బదులు రూపాయల్లో జరపాలన్న వ్యవహారంపై పెద్ద బ్యాంకులు ఆర్బీఐ నుంచి స్పష్టతను మరియు భరోసాను కోరాయి. ఈ కొత్త ప్రక్రియను ప్రారంభించటం వల్ల పశ్చిమ దేశాలు తమపై ఆర్థిక ఆంక్షలను అమలుచేయబోవనే హామీ ఇవ్వాలని అడిగాయి. ముఖ్యంగా విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి.
32% దాటట్లే
కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు సరైన వాటా దక్కట్లేదు. 41% వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం రికమండ్ చేయగా గత ఐదేళ్లలో ఒక్క ఏడాది తప్ప మిగతా నాలుగేళ్లూ 32 శాతానికి మించి ఇవ్వలేదు. ఇదే విషయాన్ని కొందరు ముఖ్యమంత్రులు మొన్నటి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు. 2019-20లో మాత్రం 37 శాతం వరకు ఇచ్చారు.
ఫైజర్ డీల్
సికిల్ సెల్ వ్యాధికి మందును తయారుచేసే గ్లోబల్ బ్లడ్ థెరాప్యుటిక్స్ అనే సంస్థను ఫైజర్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 5.4 బిలియన్ డాలర్లు. ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించేందుకు ఫైజర్ అంగీకరించింది. కొవిడ్-19 వ్యాక్సిన్ మరియు ట్రీట్మెంట్ ద్వారా ఆదాయం పెంచుకోవాలనే లక్ష్యంలో భాగంగా ఆ సంస్థను సొంతం చేసుకుంది.
మోటో జి32
మోటోరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఇవాళ ఇండియా మార్కెట్లోకి రానుంది. కొన్ని నెలల కిందట మోటో జి22 అనే మోడల్ని విడుదల చేసిన ఆ సంస్థ ఇప్పుడు జీ32 అనే మోడల్ని తీసుకొస్తోంది. జీ సిరీస్లో ఇది 6వ హ్యాండ్సెట్ అని పేర్కొంది. ఈ లేటెస్ట్ మోడల్ రేటు సుమారు 17 వేల రూపాయల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Box Office : సెప్టెంబర్లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!