Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంట నూనెల ఎంఆర్పీని 10 రూపాయలు తగ్గించాలన్న కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల రేట్లు దిగొచ్చిన నేపథ్యంలో వాటి గరిష్ట చిల్లర ధరను ఆ మేరకు సవరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దిగుమతి చేసుకునే నూనెల ఎంఆర్పీని 10 రూపాయలు తగ్గించాలని అడిగింది. మన దేశం వంట నూనెల వినియోగంలో 60 శాతానికి పైగా సరుకును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
Also Read
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
రూపాయి విలువను పెంచేందుకు చర్యలు ప్రకటించిన ఆర్బీఐ
ఈ ఏడాది ఇప్పటికే రూపాయి మారకం విలువ 6 శాతం పడిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ నష్టనివారణ చర్యలను ప్రకటించింది. దేశంలోకి విదేశీ మారక ప్రవాహాన్ని పెంచేందుకు మార్గం సుగమం చేసింది. స్వల్ప కాల కార్పొరేట్ అప్పులతోపాటు మరిన్ని ప్రభుత్వ సెక్యూరిటీలను విదేశీ పెట్టుబడిదారులు కొనుగోలు చేయటానికి ఈ చర్యలు ఉపయోగపడతాయి. ఇండియా ఫారెక్స్ నిల్వలు గత 9 నెలల్లో 40 బిలియన్ డాలర్లకు పైగా కరిగిపోయాయి.
12 వారాల కనిష్టానికి పడిపోయిన చమురు ధరలు
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంతోపాటు కరోనా వల్ల చైనాలో డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్న భయాల నేపథ్యంలో చమురు ధరలు 12 వారాల కనిష్టానికి దిగొచ్చాయి. సెప్టెంబర్ నెల బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ డెలివరీ 2.9 శాతం తగ్గింది. దీంతో ప్రస్తుతం ఒక బ్యారెల్ రేటు 99 పాయింట్ ఏడు, ఎనిమిది డాలర్లు పలుకుతోంది. అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ రేటు 3.2 శాతం తగ్గటంతో ఒక పీపా ఇంధనం ధర ఇప్పుడు 96 పాయింట్ మూడు, ఒకటి డాలర్ల వద్ద ఉంది. ఈ రేట్లు వరుసగా 9 శాతం, 8 శాతం పడిపోయిన తెల్లారే ఈ తగ్గుదల కూడా జరగటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులకు చెక్ పెట్టిన కేంద్రం
ఇప్పటికే గోధుమ ఎగుమతులను నిలిపేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గోధుమ పిండితోపాటు సంబంధిత ఉత్పత్తులన్నింటి ఎగుమతులకూ చెక్ పెట్టింది. దీంతో ఇతర దేశాలకు షిప్మెంట్లను పంపాలనుకునే ఎగుమతిదారులు ఇకపై మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా నిషేధం కాదు. ఎగుమతులను పాక్షికంగా అదుపు చేయటం మాత్రమే.
బుధవారం నుంచి 50 రూపాయలు పెరిగిన వంట గ్యాస్ ధర
వంట గ్యాస్ ధర బుధవారం నుంచి 50 రూపాయలు పెరిగింది. ఇంటి అవసరాలకు వాడుకునే 14 పాయింట్ 2 కేజీల ఎల్పీజీ సిలిండర్కి ఈ కొత్త రేటు వర్తిస్తుంది. 5 కేజీల సిలిండర్ రేటును కూడా 18 రూపాయలు పెంచారు. మరో వైపు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటు ఎనిమిదిన్నర రూపాయలు తగ్గింది.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!