NTV Telugu Site icon

Boeing: ఉద్యోగులకు బోయింగ్ షాక్.. 17 వేల మందిపై వేటు

Baoeing

Baoeing

ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ నిర్మాణాత్మక మార్పులకు సిద్ధమైంది. రాబోయే నెలల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. శ్రామిక శక్తిలో 10 శాతం తగ్గుతుందని ప్రకటించింది. దీంతో దాదాపు 17,000 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు, ఉద్యోగులపై తొలగింపు ప్రభావం చూపుతుందని బోయింగ్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ తెలిపారు. కార్మికులు సమ్మె చేయడంతో వాటిల్లిన నష్టం కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఏకంగా 17వేల మంది సిబ్బందిపై వేటు వేయనుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని తొలగించనుంది.

సియాటెల్‌ ప్రాంతంలో 33,000మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో 737 MAX, 767, 777 జెట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో 5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని సంస్థ తెలిపింది. ఈ నష్టాలను పూడ్చుకొనేందుకు ఉద్యోగుల తొలగింపు అవసరమని సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్‌ అన్నారు. రానున్న నెలల్లో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10శాతం మందిని తగ్గించాలని చూస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు ఉండనున్నారని ఆయన తెలిపారు.

సమ్మె ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో 777X జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నట్లు బోయింగ్‌ తెలిపింది. 2026లో వీటి డెలివరీలు అందిస్తామని వెల్లడించింది. ప్రస్తుత ఆర్డర్లను పూర్తి చేసిన తర్వాత 2027లో 767 ఫ్రైటర్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని బోయింగ్‌ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో బోయింగ్‌ షేర్లు 1.1శాతం క్షీణించాయి.