Gold In India: ఇండియాలో బంగారమే బంగారం.. బయటపడ్డ 42.5 టన్నుల గోల్డ్.. తవ్వకాలకు అంతా సిద్ధం..
- మే మొదటి వారం నుంచి తవ్వకాలు..?
- 42.5 టన్నుల బంగారాన్ని వెలికితీసేందుకు ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది సంప్రదాయానికి చిహ్నం, సురక్షితమైన పెట్టుబడి. ముఖ్యంగా తెలుగు మగువలకు పసిడిపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు, పండుగలు వచ్చాయంటే చాలు, ధర ఎంతున్నా కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, భారత్లో సొంతంగా బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం కావడం ఒక తీపి కబురుగా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని తవ్వకాలకు సిద్ధం కావడం విశేషం.
Also Read:House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!
Also Read
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- Bank Strike Alert: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
- LIC Yuva Term Plan: సామాన్యులకు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.24తో రూ.50 లక్షల ఇన్సూరెన్స్! ఓ లుక్ వేయండి..
ఏపీలో పసిడి సిరి..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్ (బంగారు గని) ప్రారంభానికి సిద్ధమైంది. ‘డెక్కన్ గోల్డ్ మైన్స్’ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ మే 2026 మొదటి వారం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. గత కొన్ని ఏళ్లుగా జరుగుతున్న అన్వేషణలు ముగిసి, ఇప్పుడు వాణిజ్యపరమైన ఉత్పత్తికి ముహూర్తం ఖరారైంది.
Also Read:New Pensions: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి కూడా పెన్షన్లు..
భారీ నిక్షేపాలు.. సిద్ధంగా పసిడి!
తాజా నివేదికల ప్రకారం.. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జొన్నగిరి గనుల్లో సుమారు 42.5 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో దాదాపు 13.1 టన్నుల బంగారాన్ని తక్షణమే వెలికితీయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ భాగస్వామ్యం కావడంతో అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎక్కువ పసిడిని సేకరించేలా ఏర్పాట్లు చేశారు.
Also Read:Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?
ఆర్థిక వ్యవస్థకు బూస్ట్..
భారత్ ఏటా వేల టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతోంది. ఏపీలో ప్రారంభం కానున్న ఈ గని ద్వారా దేశీయంగా ఉత్పత్తి పెరిగి, దిగుమతులపై భారం కొంత తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, స్థానికంగా వందలాది మందికి ఉపాధి లభించనుంది. మొత్తానికి.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభం కానున్న ఈ ‘గోల్డ్ రష్’ భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త వెలుగులు తీసుకురానుంది.
తాజావార్తలు
-
Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
-
Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
-
Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
-
Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
-
Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!