Gold In India: ఇండియాలో బంగారమే బంగారం.. బయటపడ్డ 42.5 టన్నుల గోల్డ్.. తవ్వకాలకు అంతా సిద్ధం..
- మే మొదటి వారం నుంచి తవ్వకాలు..?
- 42.5 టన్నుల బంగారాన్ని వెలికితీసేందుకు ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది సంప్రదాయానికి చిహ్నం, సురక్షితమైన పెట్టుబడి. ముఖ్యంగా తెలుగు మగువలకు పసిడిపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు, పండుగలు వచ్చాయంటే చాలు, ధర ఎంతున్నా కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, భారత్లో సొంతంగా బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం కావడం ఒక తీపి కబురుగా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని తవ్వకాలకు సిద్ధం కావడం విశేషం.
Also Read:House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!
Also Read
- Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
- SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
- Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
- Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
ఏపీలో పసిడి సిరి..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్ (బంగారు గని) ప్రారంభానికి సిద్ధమైంది. ‘డెక్కన్ గోల్డ్ మైన్స్’ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ మే 2026 మొదటి వారం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. గత కొన్ని ఏళ్లుగా జరుగుతున్న అన్వేషణలు ముగిసి, ఇప్పుడు వాణిజ్యపరమైన ఉత్పత్తికి ముహూర్తం ఖరారైంది.
Also Read:New Pensions: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి కూడా పెన్షన్లు..
భారీ నిక్షేపాలు.. సిద్ధంగా పసిడి!
తాజా నివేదికల ప్రకారం.. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జొన్నగిరి గనుల్లో సుమారు 42.5 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో దాదాపు 13.1 టన్నుల బంగారాన్ని తక్షణమే వెలికితీయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ భాగస్వామ్యం కావడంతో అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎక్కువ పసిడిని సేకరించేలా ఏర్పాట్లు చేశారు.
Also Read:Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?
ఆర్థిక వ్యవస్థకు బూస్ట్..
భారత్ ఏటా వేల టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతోంది. ఏపీలో ప్రారంభం కానున్న ఈ గని ద్వారా దేశీయంగా ఉత్పత్తి పెరిగి, దిగుమతులపై భారం కొంత తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, స్థానికంగా వందలాది మందికి ఉపాధి లభించనుంది. మొత్తానికి.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభం కానున్న ఈ ‘గోల్డ్ రష్’ భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త వెలుగులు తీసుకురానుంది.
తాజావార్తలు
-
Rail Parcel App: గుడ్న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
-
Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్లో మాయమైన వైరస్ శాంపిల్స్!
-
Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
-
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..
-
INDIA Bloc: ఇండియా కూటమికి డీఎంకే గుడ్బై.. బయటకొచ్చినట్లు ప్రకటన