Gold In India: ఇండియాలో బంగారమే బంగారం.. బయటపడ్డ 42.5 టన్నుల గోల్డ్.. తవ్వకాలకు అంతా సిద్ధం..
- మే మొదటి వారం నుంచి తవ్వకాలు..?
- 42.5 టన్నుల బంగారాన్ని వెలికితీసేందుకు ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది సంప్రదాయానికి చిహ్నం, సురక్షితమైన పెట్టుబడి. ముఖ్యంగా తెలుగు మగువలకు పసిడిపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు, పండుగలు వచ్చాయంటే చాలు, ధర ఎంతున్నా కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, భారత్లో సొంతంగా బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం కావడం ఒక తీపి కబురుగా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని తవ్వకాలకు సిద్ధం కావడం విశేషం.
Also Read:House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!
Also Read
- RBI New Currency Notes: ఆర్బీఐ సంచలన ప్లాన్..? పాత కరెన్సీ నోట్లు బ్యాన్..!?
- Explainer: చనిపోయిన తర్వాత భారతీయుల ర*క్తాన్ని తాగుతున్నారు.. వెలుగులోకి భయంకర లెక్కలు!
- 5 Big Rule Changes: జూన్ 1 నుంచి భారీ మార్పులు.. ప్రతి ఇంటిపై ప్రభావం..!
- Loans: లోన్లు ఇవ్వడంలో పురుషుల కంటే మహిళలకే బ్యాంకుల ప్రాధాన్యం..! ఎందుకిలా జరుగుతోంది?
ఏపీలో పసిడి సిరి..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్ (బంగారు గని) ప్రారంభానికి సిద్ధమైంది. ‘డెక్కన్ గోల్డ్ మైన్స్’ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ మే 2026 మొదటి వారం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. గత కొన్ని ఏళ్లుగా జరుగుతున్న అన్వేషణలు ముగిసి, ఇప్పుడు వాణిజ్యపరమైన ఉత్పత్తికి ముహూర్తం ఖరారైంది.
Also Read:New Pensions: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి కూడా పెన్షన్లు..
భారీ నిక్షేపాలు.. సిద్ధంగా పసిడి!
తాజా నివేదికల ప్రకారం.. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జొన్నగిరి గనుల్లో సుమారు 42.5 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో దాదాపు 13.1 టన్నుల బంగారాన్ని తక్షణమే వెలికితీయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ భాగస్వామ్యం కావడంతో అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎక్కువ పసిడిని సేకరించేలా ఏర్పాట్లు చేశారు.
Also Read:Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?
ఆర్థిక వ్యవస్థకు బూస్ట్..
భారత్ ఏటా వేల టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతోంది. ఏపీలో ప్రారంభం కానున్న ఈ గని ద్వారా దేశీయంగా ఉత్పత్తి పెరిగి, దిగుమతులపై భారం కొంత తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, స్థానికంగా వందలాది మందికి ఉపాధి లభించనుంది. మొత్తానికి.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభం కానున్న ఈ ‘గోల్డ్ రష్’ భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త వెలుగులు తీసుకురానుంది.
తాజావార్తలు
-
Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
-
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
-
Naga Chaitanya : ఢిల్లీ హైకోర్టులో అక్కినేని నాగచైతన్యకు ఊరట
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!