Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
- జియో ప్లాట్ఫామ్స్ ఎండీగా ఆకాష్ అంబానీ
- ఐదేళ్ల పాటు బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akash Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగమైన ‘జియో ప్లాట్ఫామ్స్’ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఆకాష్ అంబానీని నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 9, 2026 నుంచి ఐదేళ్ల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) ఫైలింగ్స్ ద్వారా స్పష్టం అయ్యింది. ఏప్రిల్ 9న జరిగిన బోర్డు సమావేశంలో ఆకాష్ అంబానీని జియో కంపెనీ ఎండీ నియామకానికి ఆమోదం లభించింది.
జియోలో ఆకాష్ ప్రస్థానం ఇదే..
2014లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరిన ఆకాష్, 2022లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. త్వరలో జియో ప్లాట్ఫామ్స్ భారీ ఐపీఓ (IPO)కి సిద్ధమవుతున్న వేళ ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు, ఇన్వెస్టర్లతో కంపెనీ చర్చలు జరుపుతోంది. 2020లో గూగుల్, మెటా (ఫేస్బుక్), కేకేఆర్ వంటి 13 ప్రపంచ స్థాయి సంస్థల నుంచి సుమారు రూ.1.5 లక్షల కోట్ల నిధులను సేకరించడం ద్వారా జియో ప్లాట్ఫామ్స్ వార్తల్లో నిలిచింది. ఈ నిధులతో కంపెనీ అప్పుల్లేని (Net Debt-Free) సంస్థగా అవతరించింది. కేవలం టెలికాం రంగానికే పరిమితం కాకుండా.. 5G, హోమ్ బ్రాడ్బ్యాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్-టెక్, శాటిలైట్ కనెక్టివిటీ వంటి విభాగాల్లో భవిష్యత్తులో జియో తన ఉనికిని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
- Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
- Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
తాజావార్తలు
-
Israel: ఖమేనీ అంత్యక్రియల రోజే ఇరాన్కు షాక్.. ఇజ్రాయిల్ సంచలన హెచ్చరిక
-
Aakash Chopra: ‘సంజూకు అన్యాయం చేశారు.. మరొకరిపై వేటు వెయ్యాలని చూస్తున్నారా..?’
-
Prashant Kishor: ‘కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తామనుకుంటున్నారు’ బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు
-
US-Iran: మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ఎప్పుడంటే..!
-
Allu Arjun-Atlee: అల్లు అర్జున్ కీలక నిర్ణయం.. డైరెక్టర్ అట్లీకి డెడ్లైన్?
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!