Airtel: యూజర్లకు ఎయిర్టెల్ షాక్.. ఆ చౌకైన ప్లాన్ తొలగింపు!
- జియో బాటలోనే ఎయిర్టెల్ టెలికాం..
- యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ఎయిర్టెల్..
- 1జీబీ డేటా ప్లాన్ రద్దు చేసిన ఎయిర్టెల్ భారతీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel: టెలికాం రంగంలో మరో భారీ మార్పు జరిగింది. జియో 1 జీబీ డేటా ప్లాన్ను ఆపేసిన కొద్దిసేపటికే, ఎయిర్టెల్ కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తూ.. వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇక, రూ.249 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులో ఉండదని పేర్కొనింది. ఇక, వొడాఫోన్ ఐడియా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
Read Also: Hyderabad Couple Caught Smuggling Ganja: ఇలాంటి వారిని పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైమ్..
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
కాగా, ప్రస్తుతం ఎయిర్టెల్ రూ.249 ప్యాక్లో 24 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిజేస్తోంది. కానీ, ఈ ప్లాన్ రద్దైన తర్వాత, యూజర్లు కనీసం రూ.319 రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త ప్యాక్ నెల రోజుల వ్యాలిడిటీతో కొనసాగుతుంది. కాగా, వొడాఫోన్ ఐడియా మాత్రం రూ.299కు రోజుకు 1 జీబీ డేటా ప్లాన్ అందజేస్తుంది. అయితే, రిలయన్స్ జియో విషయాని వస్తే, ప్రస్తుతం జియో వెబ్సైట్లో రూ.299 (1.5 జీబీ/డే – 28 రోజులు) బేస్ ఆప్షన్గా తీసుకు రాగా, రూ.349 (2 జీబీ/డే – 28 రోజులు) ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉంచింది.
Read Also: Hyd Girl Death Update: బిల్డింగ్లో ఉన్న వారే హత్య చేశారా?.. ఇప్పటికీ వీడని మిస్టరీ
అయితే, టెలికాం సంస్థలు ARPU (Average Revenue Per User) పెంచుకోవడం కోసమే ఈ ప్లాన్స్ రద్దు చేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎంట్రీ లెవల్ ప్లాన్లు తొలగించడంతో కస్టమర్లు అధిక డేటా ప్లాన్లకు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం జియో యూజర్లలో 20-25 శాతం మంది, ఎయిర్టెల్ యూజర్లలో 18-20 శాతం మంది ఎంట్రీ లెవల్ 1 జీబీ ప్లాన్ను ఉపయోగిస్తున్నారని అంచనా. ఈ మార్పులతో కంపెనీల ఆదాయం 4-7 శాతం పెరిగుతాయి.. సగటు ఆదాయం (ARPU) రూ.10-13 మేర పెరిగే ఛాన్స్ ఉందని బ్రోకరేజీ సంస్థలు పేర్కొంటున్నాయి.
- Tags
- Airtel
- ARPU
- India News
- Jio
- mobile data
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!