Airtel: యూజర్లకు ఎయిర్టెల్ షాక్.. ఆ చౌకైన ప్లాన్ తొలగింపు!
- జియో బాటలోనే ఎయిర్టెల్ టెలికాం..
- యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ఎయిర్టెల్..
- 1జీబీ డేటా ప్లాన్ రద్దు చేసిన ఎయిర్టెల్ భారతీ..
Airtel: టెలికాం రంగంలో మరో భారీ మార్పు జరిగింది. జియో 1 జీబీ డేటా ప్లాన్ను ఆపేసిన కొద్దిసేపటికే, ఎయిర్టెల్ కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తూ.. వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇక, రూ.249 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులో ఉండదని పేర్కొనింది. ఇక, వొడాఫోన్ ఐడియా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
Read Also: Hyderabad Couple Caught Smuggling Ganja: ఇలాంటి వారిని పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైమ్..
Also Read
- Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
- RBI: ఆర్బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
కాగా, ప్రస్తుతం ఎయిర్టెల్ రూ.249 ప్యాక్లో 24 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ అందిజేస్తోంది. కానీ, ఈ ప్లాన్ రద్దైన తర్వాత, యూజర్లు కనీసం రూ.319 రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త ప్యాక్ నెల రోజుల వ్యాలిడిటీతో కొనసాగుతుంది. కాగా, వొడాఫోన్ ఐడియా మాత్రం రూ.299కు రోజుకు 1 జీబీ డేటా ప్లాన్ అందజేస్తుంది. అయితే, రిలయన్స్ జియో విషయాని వస్తే, ప్రస్తుతం జియో వెబ్సైట్లో రూ.299 (1.5 జీబీ/డే – 28 రోజులు) బేస్ ఆప్షన్గా తీసుకు రాగా, రూ.349 (2 జీబీ/డే – 28 రోజులు) ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉంచింది.
Read Also: Hyd Girl Death Update: బిల్డింగ్లో ఉన్న వారే హత్య చేశారా?.. ఇప్పటికీ వీడని మిస్టరీ
అయితే, టెలికాం సంస్థలు ARPU (Average Revenue Per User) పెంచుకోవడం కోసమే ఈ ప్లాన్స్ రద్దు చేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎంట్రీ లెవల్ ప్లాన్లు తొలగించడంతో కస్టమర్లు అధిక డేటా ప్లాన్లకు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం జియో యూజర్లలో 20-25 శాతం మంది, ఎయిర్టెల్ యూజర్లలో 18-20 శాతం మంది ఎంట్రీ లెవల్ 1 జీబీ ప్లాన్ను ఉపయోగిస్తున్నారని అంచనా. ఈ మార్పులతో కంపెనీల ఆదాయం 4-7 శాతం పెరిగుతాయి.. సగటు ఆదాయం (ARPU) రూ.10-13 మేర పెరిగే ఛాన్స్ ఉందని బ్రోకరేజీ సంస్థలు పేర్కొంటున్నాయి.
- Tags
- Airtel
- ARPU
- India News
- Jio
- mobile data
తాజావార్తలు
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!