Air India: ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్.. కేవలం రూ.1,499కే విమాన టిక్కెట్లు!
- ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్
- కేవలం రూ.1,499కే విమాన టిక్కెట్లు
- ఫిబ్రవరి 6వ తేదీ వరకు అందుబాటులో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ప్రయాణం చేయాలని అంతా కలలుకంటుంటారు. కానీ, ఛార్జీలు వేలల్లో ఉండడంతో సామాన్యులకు సాధ్యపడదు. అయితే ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. చౌక ధరలోనే విమాన ప్రయాణం చేయొచ్చు. ఎలా అంటే? ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా విమాన టికెట్స్ పై ఆఫర్లు ప్రకటించింది. ఎయిరిండియా తీసుకొచ్చిన నమస్తే వరల్డ్ సేల్ లో భాగంగా కేవలం రూ.1499కే విమాన ప్రయాణం కల్పిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల టికెట్లపై భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు తెలిపింది.
ఈ సేల్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండనున్నది. ఫిబ్రవరి 2 నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమై ఫిబ్రవరి 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో బుకింగ్ చేసుకున్న వారు ఫిబ్రవరి 12 నుంచి అక్టోబర్ 31వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చని తెలిపింది. ఈ ఆఫర్ ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ కి వర్తిస్తుంది. ఈ ఆఫర్లో దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.1499 నుంచి ప్రారంభవుతున్నాయి. ప్రీమియం ఎకానమీ రూ. 3,749 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే బిజినెస్ క్లాస్ అయితే రూ.9,999 నుంచి టికెట్ రేట్లు ప్రారంభమవుతున్నాయి.
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.12,577 నుంచి ప్రారంభమవుతుండగా.. ప్రీమియం ఎకానమీ రూ.16,213 నుంచి ప్రారంభమవుతుంది. బిజినెస్ క్లాస్ విమాన టికెట్ ధర రూ.20,870 నుంచి మొదలవుతున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఎయిరిండియా అధికారిక వెబ్సైట్, యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!