Success Story: చదువు కోసం ఇండియా వచ్చిన ఫ్రెంచ్ వ్యక్తి.. శాండ్విచ్లు అమ్ముతూ నెలకు రూ.4 కోట్లు సంపాదన!
- మాస్టర్ డిగ్రీ కోసం భారత్కు వచ్చిన ఫ్రెంచ్ వ్యక్తి
- భారత్లో శాండ్విచ్ వ్యాపారం
- నెలకు రూ.4 కోట్లు సంపాదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్, అమెరికా, కెనడా ఇలా ఏ దేశానికి వెళ్లినా అక్కడి భారతీయ రెస్టారెంట్ ను చూసినప్పుడల్లా మనం గర్వపడుతుంటాం. ఈ రెస్టారెంట్లు, పలు అంశాల్లో విదేశాల్లో భారతీయులు మంచి పేరు సంపాదించుకుంటున్నారు. భారతదేశంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తుంటారు. అయితే బాగా పరిశీలిస్తే ఇక్కడ కూడా అవకాశాలు ఉన్నాయి. అలాంటిదే ఫ్రాన్స్కు చెందిన ఓ వ్యక్తి కథ. ఈ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం… ఫ్రాన్స్కు చెందిన నికోలస్ గ్రాస్మీ భారతదేశంలో పారిశ్రామికవేత్తగా మారాడు. బెంగళూరులో ఫుడ్ చైన్ ప్రారంభించి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. అతను పారిస్ పాణిని అనే శాండ్విచ్ బ్రాండ్ను నడుపుతున్నాడు. బెంగళూరులో అతడికి చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. శాండ్విచ్లు విక్రయిస్తూ ఏటా రూ.50 కోట్లు సంపాదిస్తున్నాడు.
చదువు కోసం ఇండియాకు..
ఇటీవల, గ్రోత్ఎక్స్ అనే యూట్యూబ్ ఛానెల్లో నికోలస్ తన ప్రయాణం గురించి చెప్పాడు. తాను ఫ్రాన్స్లోని సాధారణ కుటుంబం నుంచి వచ్చానని తెలిపాడు. 22 సంవత్సరాల వయస్సులో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి భారతదేశానికి వచ్చాడు. తన తల్లిదండ్రులు టీచర్లని వీడియోలో చెప్పాడు. తన తల్లికి వంట చేయడంలో సహాయం చేసేవాడు. దీంతో అతనిలో వంట పట్ల మక్కువ పెరిగింది. భారతదేశంలో చదువు పూర్తయిన తర్వాత.. 2015 సంవత్సరంలో ఫుడ్ ట్రక్ ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈరోజు వారికి బెంగళూరులో 8 డైనింగ్ అవుట్లెట్లు, 7 క్లౌడ్ కిచెన్లు ఉన్నాయి.
Also Read
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
అనేక రకాల శాండ్విచ్లు..
నికోలస్కి చిన్నప్పటి నుంచి శాండ్విచ్లంటే ఇష్టం. ఈ కారణంగానే అతను ఈ వ్యాపారం ప్రారంభించాడు. అంతే కాకుండా.. నికోలస్ వీడియోలో తన వ్యాపారం యొక్క ఆర్థిక శాస్త్రాన్ని కూడా వివరించాడు. మొత్తం ఆదాయంలో ఆహార వ్యయం వాటా 28 శాతంగా ఉందన్నారు. 10 శాతం డబ్బు అద్దె చెల్లించడానికి ఖర్చు అవుతుంది. మొత్తంలో 35 శాతం జీతం, అడ్మిన్ కోసం ఖర్చు చేస్తారు. 10 శాతం మార్కెటింగ్కు ఖర్చు చేస్తారు. మిగిలిన 15 శాతం లాభం.
నెలకు రూ.4 కోట్లు సంపాదన..
నికోలస్ తన నెలవారీ ఆదాయం రూ. 4 కోట్లు అంటే సంవత్సరానికి రూ. 50 కోట్లు. ఎక్కువ విక్రయాలు ఆన్లైన్లోనే జరుగుతాయి. దాదాపు 70 శాతం ఆన్లైన్లోనే కొనసాగుతోంది. మిగిలిన 30 శాతం విక్రయాలు ఆఫ్లైన్లో ఉంటుంది.
తాజావార్తలు
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?