ఎంతగా కష్టపడి సంపాదించినా కూడా చేతిలో ఉండటం లేదని చాలా మంది అంటుంటారు.. అందుకు కారణం లేకపోలేదు.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చేసినా కూడా అది వృధా అవుతుంది.. డబ్బుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలంటే.. వాస్తు పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. అప్పుడే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
*. ఇంట్లో ప్రతి రోజూ సాయంత్రం ఆవ నూనె దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది..
*. కర్పూరాన్ని ముఖ్యమైన పదార్థంగా పరిగణిస్తారు. ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించి.. వాస్తు దోషాన్ని తొలగిస్తుంది. ప్రతి రోజూ కర్పూరాన్ని ఇంట్లో రాస్తే ఆ ఇల్లు సువాసనల తో నిండుతుంది. ఈ విధంగా కూడా లక్ష్మీ దేవి అనుగ్రహం మీకు ఉంటుంది..
*. సాయంత్రం లక్ష్మీ దేవి ఇంటికి వచ్చే సమయం. సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో పడుకోవడం మానుకోవాలి. లేదంటే లక్ష్మీ దేవిని అవమానించినట్టు ఉంటుంది. దీంతో లక్ష్మీ దేవి ఆగ్రహాని కి గురి అవుతుంది..
*. ఆవును గోమాత, గౌరీ మాత అంటారు.. ఆవుకి రోజూ ఆహారం అందించడం మంచిది. సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే ప్రతిరోజూ పక్షులకు కూడా ఆహారం ఇవ్వాలి. పక్షులకు గింజలు తినిపిస్తే.. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగి పోతాయి… ఎప్పుడూ వేరే వారిని తక్కువ చేసి చూడకూడదు.. అమ్మకి కోపం వస్తుంది.. ఈ పొరపాట్లు ఎప్పుడు చెయ్యకండి..