శ్రావణమాసంలో వచ్చే పండుగలలో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం.. మహిళలకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది.. మనకు అన్నిరకాల ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీ దేవిని ఎక్కువగా పూజిస్తాము.. అమ్మ అనుగ్రహం ఉంటే ఇక డబ్బులకు డోకా ఉండదు..కొంత మంది తక్కువ కష్టపడి పనిచేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకి లోటు ఉండదు. మరోవైపు ఎంత కష్టపడి పనిచేసినా తగిన ఫలితం దక్కదు. ఆర్థిక సంక్షోభంలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో సంపద అధిదేవత లక్ష్మీదేవికి కోపం వస్తే.. ఆ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులుంటాయి.. అందుకే వరలక్ష్మిని పూజిస్తారు..ఈ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలంటే వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఇంట్లో ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమ సంపద, పర్సు , డబ్బును తప్పుడు చేతితో తాకిన వారిపై లక్ష్మీదేవి కోపంతో అక్కడ నుంచి వదిలి వెళ్తుంది.
రాత్రిపూట వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచరాదు. లేదా అంతేకాదు ఎంగిలి పాత్రలను కొందరు పొయ్యిపై ఉంచుతారు. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో ధన, ధాన్యాల కొరత ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు.
మాములుగా శుభ్రత లేని పరిసరాలు, మురికి నిండిన ఇంట్లో సంపద అధిదేవత లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది..
సూర్యస్తసమయం తర్వాత ఇల్లు ఊడవడం తుడవడం చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది.. దాంతో ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది..ఇక ఆ ఇంట్లో ఎప్పుడు అమ్మవారు నిల్వదు..
అమ్మవారికి ఎలా ఉంటే ఇష్టం?
స్త్రీలను గౌరవించే, ఆవును ప్రత్యేకంగా పూజించే ఇంటిలో లక్ష్మిదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది.శ్రీ మహా విష్ణువు ప్రతిరోజు తులసిని నైవేద్యంగా పెట్టి పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా ఆ ఇంటివైపు ఆకర్షితులవుతుందని నమ్ముతారు..
ఇంట్లో స్వచ్ఛత, పరిశుభ్రతను కాపాడుకునేవారు సూర్యోదయానికి ముందే లేచే వారి పట్ల ఎల్లప్పుడూ సంపద దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఉంటుంది.
గొడవలు ఉంటే ఆ ఇంట్లోకి అమ్మవారు రారు.. ప్రేమ, అనురాగాలు ఉన్న ఇంట్లోకి అమ్మ సంతోషంగా వస్తుంది.. మనిషి చేసే ప్రతి పనిని బట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది.. ఒక్క వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే కాదు ప్రతి రోజు శుభ్రంగా ఉంటే ఆ ఇంటిని వదిలి వెళ్ళదు.. ఇది గుర్తుంచుకోండి..