ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన నేటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. నేడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందాం. కింది వీడియోలో పూర్తి సమాచారం ఉంటుంది.
మేష రాశి: ఈ రాశి వారు అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివాలయంలో అర్చన చేయించుకోవడం వల్ల శుభం కలుగుతుంది.
వృషభ రాశి: వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. సరస్వతీ దేవిని గన్నేరు పుష్పాలతో పూజించడం ఉత్తమం.
మిథున రాశి: పెండింగ్లో ఉన్న బాకీలు వసూలవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. పరమేశ్వరుడికి పంచామృత అభిషేకం చేయాలి.
కర్కాటక రాశి: ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఉద్యోగాల్లో సమాచార లోపం తలెత్తకుండా జాగ్రత్త పడాలి. సంకటనాశ గణపతి స్తోత్రం పారాయణం చేయండి.
సింహ రాశి: ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు వేగం వద్దు, అధికారుల విమర్శలకు అవకాశం ఇవ్వకండి. నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం శుభప్రదం.
కన్య రాశి: ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అప్పులు తీర్చగలుగుతారు. అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
తులా రాశి: ఉద్యోగంలో ప్రశంసలు దక్కుతాయి. సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. రాహుకాలంలో దుర్గాదేవికి పూజ చేయడం మంచిది.
వృశ్చిక రాశి: కుటుంబంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. రామ నామాన్ని నిరంతరం జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ధనుస్సు రాశి: తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. పసుపు గణపతిని పూజించండి.
మకర రాశి: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కృష్ణ కవచం పారాయణం చేయాలి.
కుంభ రాశి: ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. బద్ధకాన్ని విడనాడాలి. నవగ్రహ దర్శనం చేసుకోవడం ఉత్తమం.
మీన రాశి: చేపట్టిన పనులు మధ్యలో ఆగకుండా చూసుకోవాలి. నిర్లక్ష్యం పనికిరాదు. దక్షిణామూర్తి స్వామి వారి గురుపాదుకా స్తోత్రాన్ని పారాయణం చేయండి.
