మన దేశంలో భక్తులు ఎక్కువగా ఉన్నారు.. అందుకే వీధికి రెండు గుడ్లు ఉంటాయి.. కొన్ని దేవాలయాలకు ప్రత్యేకతలు ఉన్నాయి.. అందులో ఒకటి శ్రీ బేడి ఆంజనేయ స్వామి.. ఈ స్వామి గురించి అందరికి తెలిసే ఉంటుంది.. అయితే ఇక్కడ స్వామికి ఎందుకు బేడీలు వేసారో బేడీలు వేసారో మాత్రం ఎవ్వరికి తెలియదు.. ఆ ఆలయం చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ దేవాలయం శ్రీ వెంకటేశ్వర క్షేత్ర మహా ద్వారానికి ఎదురుగా ఉంది. దీంతో పాటు అభయారణ్యం శ్రీ భూ వరాహ స్వామి దేవాలయం కూడా కొలువై ఉంటుంది.. ఈ దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రతి రోజు ఈ మందిరానికి తీసుకొస్తారు.బేడి ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక ఉన్న కథ ఆ పురాణాల ప్రకారం హనుమంతుడు తన చిన్నతనంలో ఒంటెను వెతకడానికి తిరుమలను విడిచి పెట్టాలని కోరుకున్నాడని చెబుతారు. అయితే అతని తల్లి అంజనాదేవి అతని మణికట్టుకు బేడి తో కట్టి ఆమె తిరిగి వచ్చేవరకు ఆ ప్రదేశంలో ఉండమని ఆదేశించిందని కథనాలు ఉన్నాయి..
అయితే అలా వెళ్ళిన అంజనాదేవి ఇక తిరిగి రాలేదని స్థానికులు భక్తులు చెబుతున్నారు. ఈ దేవాలయంలోని హనుమంతుని చిహ్నం రెండు చేతులకు సంకెళ్లు ఉన్న ఒక ప్రత్యేకమైన ఆకృతి లో కనిపిస్తుంది. అంతేకాదు ఈ దేవాలయానికి చాలా ప్రత్యేక ఉంది. భక్తులు ఏవైనా కష్టాలు ఉన్నాయని స్వామి వారికి చెప్పి వేడుకుంటే వెంటనే ఆ కోరికలు నెరవేరుగాయని ప్రజలు నమ్ముతారు. ఇప్పటికీ ఆంజనేయ స్వామి అక్కడే స్థిరపడిపోయినట్లు వైష్ణవ సంప్రదాయాల ప్రకారం ప్రధాన దేవాలయానికి ఎదురుగా ఆంజనేయుడు ఉన్నాడు.. తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయ స్వామి ప్రధాన దేవాలయానికి ఎదురుగా దర్శనమిస్తారు.బేడి ఆంజనేయ స్వామి దేవాలయ సమయాలు ప్రతి రోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి దర్శనం ఉంటుంది. ప్రతి ఏడాది హనుమాన్ జయంతి రోజు ప్రత్యేక అభిషేకం మరియు ఉత్సవం చేస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన వారు తప్పకుండా ఈ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సుఖ సంతోషాలతో వర్దిల్లుతారని జనాల నమ్మకం.. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తారని చెబుతున్నారు..