Navaratri : నవరాత్రుల్లో ఈ పనులు అస్సలు చెయ్యకూడదు.. ఎందుకంటే?
భారత దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి.. తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాలతో పూజిస్తూ ఉంటారు. ఇక శారదీయ నవరాత్రులుగా పిలువబడే ఈ రెండవ నవరాత్రులు ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తి నిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తారు.. అయితే ఇలాంటి పవిత్రమైన రోజుల్లో కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదట.. అవేంటో వివరంగా తెలుసుకుందాం..
నవరాత్రి సమయంలో కచ్చితంగా మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ తొమ్మిది రోజులపాటు ఎలాంటి మాంసం కూడా తీసుకోరాదు. నవరాత్రి సమయంలో మాంసం తినకుండా దూరంగా ఉండాలి.. ఇక అమ్మవారిని పూజించేవారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంను సమర్పిస్తారు.. ఈ నైవేద్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లి, వెల్లుల్లిని అస్సలు వాడకూడదట.. అమ్మవారికి ఆగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి..
Also Read
- Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
- Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
- Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
నవరాత్రులలో ప్రజలు తరచుగా స్నానం చేశాక గోళ్లను, జుట్టును కత్తిరించుతూ ఉంటారు.కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు. హిందూ మతం ప్రకారం ఉపవాస సమయంలో జుట్టు గానీ గోళ్ళు కానీ కత్తిరించడం వలన అశుభం కలుగుతుంది.. అలాగే ఈ నవరాత్రుల్లో మధ్యపానం, దుమపానం కు దూరంగా ఉండాలి.. ఆహారం వృధా చేస్తూ ఉంటారు. కానీ ఆహారం వృధా చేయడం పాపం.. ఇక నవరాత్రుల్లో బూతులు, అసహ్యకరమైన మాటలు అస్సలు మాట్లాడకండి.. ఎందుకంటే ఈ మాసం చాలా పవిత్రమైనది.. స్త్రీలను అగౌరవపరచకూడదు. ఎందుకంటే నవరాత్రుల తొమ్మిది రోజుల సమయంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు.. అందుకే అమ్మవారి స్వరూపాలైన స్త్రీలను గౌరవించాలి.. ఈ విషయాలను తప్పక గుర్తు పెట్టుకోవాలి..
- Tags
- about history
- Navaratri
- puja
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!