Mahashivratri 2026: నేడు ‘మహాశివరాత్రి’.. ‘శివలింగం’ ఆధ్యాత్మిక అర్థం, శాస్త్రార్థం ఏంటో తెలుసా?
- నేడు 'మహాశివరాత్రి'
- లింగం అనే పదానికి ఎన్నో తాత్త్విక అర్థాలు
- లింగం అంటే మూర్తి లేదా ప్రతీక రూపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సృష్టి, స్థితి, లయలను నిర్వహించే పరమేశ్వర తత్వాన్ని అనేక రూపాల్లో భావించి ఆరాధించడం భారతీయ సనాతన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. వేదాలు, ఆగమాలు, పురాణాలు సూచించిన విధానాల ద్వారా భగవంతుని చైతన్యాన్ని అనుభవించి అనుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వీకులు వివిధ ఆరాధనా పద్ధతులను రూపొందించారు. వాటిలో అత్యంత ప్రాచీనమైన, గౌరవనీయమైన ఆరాధనా విధానం ‘శివలింగారాధన’.
‘లింగం’ అనే పదానికి ఎన్నో తాత్త్విక అర్థాలు ఉన్నాయి. సాధారణంగా స్థూల అర్థంలో లింగం అంటే మూర్తి లేదా ప్రతీక రూపం అని చెప్పవచ్చు. భగవంతుడు నిరాకార స్వరూపుడు. ఆయన్ను మన కళ్లతో నేరుగా దర్శించలేము. అందుకే మనస్సు కేంద్రీకరించేందుకు ఒక ప్రతీక రూపాన్ని మనం స్వీకరిస్తాం. ఆ ప్రతీక శిల రూపంలోనైనా, విగ్రహ రూపంలోనైనా, కలశం, పసుపు ముద్ద వంటి సూచిక రూపంలోనైనా ఉండవచ్చు.
Also Read
- Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
శాస్త్రపద్ధతుల ప్రకారం.. ఆ ప్రతీకకు ప్రతిష్ఠ, ఆవాహన వంటి కర్మలు నిర్వహించి దైవసాన్నిధ్యాన్ని ఆహ్వానిస్తారు. అలా శాస్త్రోక్తంగా ఆరాధింపబడే ఆ బింబాన్నే లింగం అని పిలుస్తారు. అంటే శివలింగం అనేది కేవలం ఒక రాయి లేదా ఆకారం కాదు.. అది పరమాత్మ తత్వానికి సూచిక, సృష్టి మూలాన్ని సూచించే చిహ్నం. తాత్త్విక దృష్టిలో శివలింగం విశ్వ సృష్టి యొక్క ఆది తత్వాన్ని సూచిస్తుంది. అది ఆకార–నిరాకార సమన్వయానికి ప్రతీక. భక్తి, ధ్యానం, తపస్సు ద్వారా ఆ చిహ్నాన్ని ఆరాధించడం ద్వారా భక్తుడు పరమేశ్వర చైతన్యాన్ని అనుభవిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. అందుకే శివలింగారాధనను సనాతన ధర్మంలో అత్యున్నత సాధనల్లో ఒకటిగా భావిస్తారు.
Also Read: IND vs PAK: నేడే భారత్, పాకిస్థాన్ పోరు.. హై ఓల్టేజ్ మ్యాచ్ జరగడం అనుమానమే!
ఫాల్గుణమాస కృష్ణపక్ష చతుర్ధశి రోజున మహాశివరాత్రి పండగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. మహాశివరాత్రి రోజున శివుడు నిరాకర రూపం నుంచి సాకార రూపంలో ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు శివపార్వతుల కళ్యాణం జరిగిన పవిత్ర రాత్రి అని కూడా భక్తులు విశ్వసిస్తారు. మహాశివరాత్రి రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల.. ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. శివలింగానికి ధాతుర, గంగా జలాన్ని సమర్పించడం వల్ల పుణ్యం వస్తుంది. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే గ్రహాల దుష్ప్రభావాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. నేడు మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది)
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!