Mahashivratri 2026: నేడు ‘మహాశివరాత్రి’.. ‘శివలింగం’ ఆధ్యాత్మిక అర్థం, శాస్త్రార్థం ఏంటో తెలుసా?
- నేడు 'మహాశివరాత్రి'
- లింగం అనే పదానికి ఎన్నో తాత్త్విక అర్థాలు
- లింగం అంటే మూర్తి లేదా ప్రతీక రూపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సృష్టి, స్థితి, లయలను నిర్వహించే పరమేశ్వర తత్వాన్ని అనేక రూపాల్లో భావించి ఆరాధించడం భారతీయ సనాతన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. వేదాలు, ఆగమాలు, పురాణాలు సూచించిన విధానాల ద్వారా భగవంతుని చైతన్యాన్ని అనుభవించి అనుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వీకులు వివిధ ఆరాధనా పద్ధతులను రూపొందించారు. వాటిలో అత్యంత ప్రాచీనమైన, గౌరవనీయమైన ఆరాధనా విధానం ‘శివలింగారాధన’.
‘లింగం’ అనే పదానికి ఎన్నో తాత్త్విక అర్థాలు ఉన్నాయి. సాధారణంగా స్థూల అర్థంలో లింగం అంటే మూర్తి లేదా ప్రతీక రూపం అని చెప్పవచ్చు. భగవంతుడు నిరాకార స్వరూపుడు. ఆయన్ను మన కళ్లతో నేరుగా దర్శించలేము. అందుకే మనస్సు కేంద్రీకరించేందుకు ఒక ప్రతీక రూపాన్ని మనం స్వీకరిస్తాం. ఆ ప్రతీక శిల రూపంలోనైనా, విగ్రహ రూపంలోనైనా, కలశం, పసుపు ముద్ద వంటి సూచిక రూపంలోనైనా ఉండవచ్చు.
Also Read
- Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
- Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
- Spiritual: రావణుడు ప్రతిష్ఠించిన శివాలయాలు ఇవే.. వాటి వెనుక ఉన్న పురాణ రహస్యాలు తెలుసా?
- Kitchen Vastu Tips: మీ వంటగదిలో విరిగిన చపాతీ పీట ఉందా? బాబోయ్ జాగ్రత్త! ఎందుకో తెలుసా
శాస్త్రపద్ధతుల ప్రకారం.. ఆ ప్రతీకకు ప్రతిష్ఠ, ఆవాహన వంటి కర్మలు నిర్వహించి దైవసాన్నిధ్యాన్ని ఆహ్వానిస్తారు. అలా శాస్త్రోక్తంగా ఆరాధింపబడే ఆ బింబాన్నే లింగం అని పిలుస్తారు. అంటే శివలింగం అనేది కేవలం ఒక రాయి లేదా ఆకారం కాదు.. అది పరమాత్మ తత్వానికి సూచిక, సృష్టి మూలాన్ని సూచించే చిహ్నం. తాత్త్విక దృష్టిలో శివలింగం విశ్వ సృష్టి యొక్క ఆది తత్వాన్ని సూచిస్తుంది. అది ఆకార–నిరాకార సమన్వయానికి ప్రతీక. భక్తి, ధ్యానం, తపస్సు ద్వారా ఆ చిహ్నాన్ని ఆరాధించడం ద్వారా భక్తుడు పరమేశ్వర చైతన్యాన్ని అనుభవిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. అందుకే శివలింగారాధనను సనాతన ధర్మంలో అత్యున్నత సాధనల్లో ఒకటిగా భావిస్తారు.
Also Read: IND vs PAK: నేడే భారత్, పాకిస్థాన్ పోరు.. హై ఓల్టేజ్ మ్యాచ్ జరగడం అనుమానమే!
ఫాల్గుణమాస కృష్ణపక్ష చతుర్ధశి రోజున మహాశివరాత్రి పండగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. మహాశివరాత్రి రోజున శివుడు నిరాకర రూపం నుంచి సాకార రూపంలో ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు శివపార్వతుల కళ్యాణం జరిగిన పవిత్ర రాత్రి అని కూడా భక్తులు విశ్వసిస్తారు. మహాశివరాత్రి రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల.. ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. శివలింగానికి ధాతుర, గంగా జలాన్ని సమర్పించడం వల్ల పుణ్యం వస్తుంది. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే గ్రహాల దుష్ప్రభావాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. నేడు మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది)
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!