Mahashivratri 2026: నేడు ‘మహాశివరాత్రి’.. ‘శివలింగం’ ఆధ్యాత్మిక అర్థం, శాస్త్రార్థం ఏంటో తెలుసా?
- నేడు 'మహాశివరాత్రి'
- లింగం అనే పదానికి ఎన్నో తాత్త్విక అర్థాలు
- లింగం అంటే మూర్తి లేదా ప్రతీక రూపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సృష్టి, స్థితి, లయలను నిర్వహించే పరమేశ్వర తత్వాన్ని అనేక రూపాల్లో భావించి ఆరాధించడం భారతీయ సనాతన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. వేదాలు, ఆగమాలు, పురాణాలు సూచించిన విధానాల ద్వారా భగవంతుని చైతన్యాన్ని అనుభవించి అనుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వీకులు వివిధ ఆరాధనా పద్ధతులను రూపొందించారు. వాటిలో అత్యంత ప్రాచీనమైన, గౌరవనీయమైన ఆరాధనా విధానం ‘శివలింగారాధన’.
‘లింగం’ అనే పదానికి ఎన్నో తాత్త్విక అర్థాలు ఉన్నాయి. సాధారణంగా స్థూల అర్థంలో లింగం అంటే మూర్తి లేదా ప్రతీక రూపం అని చెప్పవచ్చు. భగవంతుడు నిరాకార స్వరూపుడు. ఆయన్ను మన కళ్లతో నేరుగా దర్శించలేము. అందుకే మనస్సు కేంద్రీకరించేందుకు ఒక ప్రతీక రూపాన్ని మనం స్వీకరిస్తాం. ఆ ప్రతీక శిల రూపంలోనైనా, విగ్రహ రూపంలోనైనా, కలశం, పసుపు ముద్ద వంటి సూచిక రూపంలోనైనా ఉండవచ్చు.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
- Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
- Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
శాస్త్రపద్ధతుల ప్రకారం.. ఆ ప్రతీకకు ప్రతిష్ఠ, ఆవాహన వంటి కర్మలు నిర్వహించి దైవసాన్నిధ్యాన్ని ఆహ్వానిస్తారు. అలా శాస్త్రోక్తంగా ఆరాధింపబడే ఆ బింబాన్నే లింగం అని పిలుస్తారు. అంటే శివలింగం అనేది కేవలం ఒక రాయి లేదా ఆకారం కాదు.. అది పరమాత్మ తత్వానికి సూచిక, సృష్టి మూలాన్ని సూచించే చిహ్నం. తాత్త్విక దృష్టిలో శివలింగం విశ్వ సృష్టి యొక్క ఆది తత్వాన్ని సూచిస్తుంది. అది ఆకార–నిరాకార సమన్వయానికి ప్రతీక. భక్తి, ధ్యానం, తపస్సు ద్వారా ఆ చిహ్నాన్ని ఆరాధించడం ద్వారా భక్తుడు పరమేశ్వర చైతన్యాన్ని అనుభవిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. అందుకే శివలింగారాధనను సనాతన ధర్మంలో అత్యున్నత సాధనల్లో ఒకటిగా భావిస్తారు.
Also Read: IND vs PAK: నేడే భారత్, పాకిస్థాన్ పోరు.. హై ఓల్టేజ్ మ్యాచ్ జరగడం అనుమానమే!
ఫాల్గుణమాస కృష్ణపక్ష చతుర్ధశి రోజున మహాశివరాత్రి పండగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. మహాశివరాత్రి రోజున శివుడు నిరాకర రూపం నుంచి సాకార రూపంలో ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు శివపార్వతుల కళ్యాణం జరిగిన పవిత్ర రాత్రి అని కూడా భక్తులు విశ్వసిస్తారు. మహాశివరాత్రి రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల.. ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. శివలింగానికి ధాతుర, గంగా జలాన్ని సమర్పించడం వల్ల పుణ్యం వస్తుంది. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే గ్రహాల దుష్ప్రభావాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. నేడు మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది)
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!