Mahashivratri 2026: ‘మహాశివరాత్రి’ వ్రత మహిమ.. ఉపవాసం, జాగరణ తప్పక ఉండాల్సిందేనా?
- నేడు అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి
- శివరాత్రి వ్రతంలో ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ
- శివరాత్రి రోజున ఉపవాసం తప్పక చేల్సిందేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మహాశివరాత్రి’.. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించబడుతుంది. ఈ రోజు పరమేశ్వరుని ఆరాధనకు ప్రత్యేకంగా కేటాయించబడింది. శివరాత్రి వ్రతంలో ముఖ్యంగా రెండు అంశాలు ప్రధానంగా చెప్పబడుతాయి. మొదటిది ఉపవాసం, రెండవది జాగరణ. ఈ రెండు సాధనాలు శరీరం, మనస్సు, ఆత్మను పవిత్రం చేస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తాయి. నేడు మహాశివరాత్రి (ఫిబ్రవరి 15).
ఉపవాసం అంటే ఏమిటి?:
శాస్త్రాల్లో ‘ఆహార నివృత్తిః ఉపవాసః’ అని ఉపవాసానికి నిర్వచనం. అంటే ఆహారాన్ని తినకుండా ఉండడమే ఉపవాసం. అయితే ఇది కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు.. ఇంద్రియ నియంత్రణ, మనస్సు ఏకాగ్రత, దైవచింతన కలయికే నిజమైన ఉపవాసం. ప్రతి ఒక్కరి శారీరక స్థితి వేరు కాబట్టి.. అందుకు అనుగుణంగా ఆచరించాలి. శరీరం సహకరించని వారు అల్పమైన, సాత్త్వికమైన, శుద్ధమైన ఆహారాన్ని స్వీకరించవచ్చు. శరీరం సహకరిస్తే మాత్రం పూర్ణ ఉపవాసం చేయడం ఉత్తమం.
Also Read
- Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ 'సీక్రెట్స్' పాటించాల్సిందే!
- Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
- Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
జాగరణ తాత్త్విక అర్థం:
శివరాత్రి వ్రతంలో రెండవ ముఖ్యమైన అంశం జాగరణ. జాగరణ అంటే నిద్ర లేకుండా ఉండటం మాత్రమే కాదు.. దైవ ధ్యానం, జపం, భజనలు చేస్తూ రాత్రంతా పరమేశ్వరుని స్మరించటం. శాస్త్రాల ప్రకారం పరమేశ్వరుడు నిత్య జాగరణశీలుడు. ప్రళయకాలంలో సర్వ జగత్తూ నిద్రలోకి జారినా.. ఆయన మాత్రం చైతన్య స్వరూపుడిగా జాగరూకుడిగా ఉంటాడు. ఇది శివుడి జ్ఞానస్వరూపత్వానికి సంకేతం. శరీరం సహకరిస్తే జాగరణ చేయడం ఉత్తమం.
జాగరణ జ్ఞానానికి ప్రతీక:
పరమేశ్వరునికి అజ్ఞానం, మోహం వంటి లక్షణాలు లేవు. అందుకే ఆయనను నిత్యజాగృత చైతన్యంగా వర్ణిస్తారు. శివయ్యను అనుసరించే భక్తుడు కూడా జాగరణ ద్వారా తనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని.. జ్ఞానాన్ని పొందగలడని విశ్వాసం.
వ్రతాచరణ ద్వారా లభించే ఫలితాలు:
ఉపవాసం ద్వారా శరీరం శుద్ధి, జాగరణ ద్వారా మనస్సు శుద్ధి కలుగుతాయని ఆధ్యాత్మిక వేదాంతం చెబుతుంది. ఈ రెండు కలిసి భక్తుడిని దైవ చైతన్యానికి దగ్గర చేస్తాయి. శివరాత్రి రోజున ఈ విధంగా ఉపవాసం, జాగరణతో పరమేశ్వరుని ఆరాధించిన వారు ఆధ్యాత్మికంగా ధన్యులవుతారని భక్తుల నమ్మకం.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది)
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!