Mahashivratri 2026: ‘మహాశివరాత్రి’ వ్రత మహిమ.. ఉపవాసం, జాగరణ తప్పక ఉండాల్సిందేనా?
- నేడు అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి
- శివరాత్రి వ్రతంలో ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ
- శివరాత్రి రోజున ఉపవాసం తప్పక చేల్సిందేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మహాశివరాత్రి’.. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించబడుతుంది. ఈ రోజు పరమేశ్వరుని ఆరాధనకు ప్రత్యేకంగా కేటాయించబడింది. శివరాత్రి వ్రతంలో ముఖ్యంగా రెండు అంశాలు ప్రధానంగా చెప్పబడుతాయి. మొదటిది ఉపవాసం, రెండవది జాగరణ. ఈ రెండు సాధనాలు శరీరం, మనస్సు, ఆత్మను పవిత్రం చేస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తాయి. నేడు మహాశివరాత్రి (ఫిబ్రవరి 15).
ఉపవాసం అంటే ఏమిటి?:
శాస్త్రాల్లో ‘ఆహార నివృత్తిః ఉపవాసః’ అని ఉపవాసానికి నిర్వచనం. అంటే ఆహారాన్ని తినకుండా ఉండడమే ఉపవాసం. అయితే ఇది కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు.. ఇంద్రియ నియంత్రణ, మనస్సు ఏకాగ్రత, దైవచింతన కలయికే నిజమైన ఉపవాసం. ప్రతి ఒక్కరి శారీరక స్థితి వేరు కాబట్టి.. అందుకు అనుగుణంగా ఆచరించాలి. శరీరం సహకరించని వారు అల్పమైన, సాత్త్వికమైన, శుద్ధమైన ఆహారాన్ని స్వీకరించవచ్చు. శరీరం సహకరిస్తే మాత్రం పూర్ణ ఉపవాసం చేయడం ఉత్తమం.
Also Read
- Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
జాగరణ తాత్త్విక అర్థం:
శివరాత్రి వ్రతంలో రెండవ ముఖ్యమైన అంశం జాగరణ. జాగరణ అంటే నిద్ర లేకుండా ఉండటం మాత్రమే కాదు.. దైవ ధ్యానం, జపం, భజనలు చేస్తూ రాత్రంతా పరమేశ్వరుని స్మరించటం. శాస్త్రాల ప్రకారం పరమేశ్వరుడు నిత్య జాగరణశీలుడు. ప్రళయకాలంలో సర్వ జగత్తూ నిద్రలోకి జారినా.. ఆయన మాత్రం చైతన్య స్వరూపుడిగా జాగరూకుడిగా ఉంటాడు. ఇది శివుడి జ్ఞానస్వరూపత్వానికి సంకేతం. శరీరం సహకరిస్తే జాగరణ చేయడం ఉత్తమం.
జాగరణ జ్ఞానానికి ప్రతీక:
పరమేశ్వరునికి అజ్ఞానం, మోహం వంటి లక్షణాలు లేవు. అందుకే ఆయనను నిత్యజాగృత చైతన్యంగా వర్ణిస్తారు. శివయ్యను అనుసరించే భక్తుడు కూడా జాగరణ ద్వారా తనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని.. జ్ఞానాన్ని పొందగలడని విశ్వాసం.
వ్రతాచరణ ద్వారా లభించే ఫలితాలు:
ఉపవాసం ద్వారా శరీరం శుద్ధి, జాగరణ ద్వారా మనస్సు శుద్ధి కలుగుతాయని ఆధ్యాత్మిక వేదాంతం చెబుతుంది. ఈ రెండు కలిసి భక్తుడిని దైవ చైతన్యానికి దగ్గర చేస్తాయి. శివరాత్రి రోజున ఈ విధంగా ఉపవాసం, జాగరణతో పరమేశ్వరుని ఆరాధించిన వారు ఆధ్యాత్మికంగా ధన్యులవుతారని భక్తుల నమ్మకం.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది)
తాజావార్తలు
-
Karnataka CM: ఢిల్లీ వేదికగా సిద్ధరామయ్య ఔట్.. కర్ణాటక సీఎం పగ్గాలు డీకే హస్తగతం!
-
Supreme Court: VVPAT స్లిప్పులపై ‘టైమ్ స్టాంప్’.. సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. ఏమన్నారంటే..
-
Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..
-
IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
-
Musical Drama : గొంతు క్యాన్సర్ తో పోరాడే రేడియో జాకీ… నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ ఎమోషనల్ డ్రామా
ట్రెండింగ్
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!