Mahashivratri 2026: ‘మహాశివరాత్రి’ వ్రత మహిమ.. ఉపవాసం, జాగరణ తప్పక ఉండాల్సిందేనా?
- నేడు అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి
- శివరాత్రి వ్రతంలో ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ
- శివరాత్రి రోజున ఉపవాసం తప్పక చేల్సిందేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మహాశివరాత్రి’.. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించబడుతుంది. ఈ రోజు పరమేశ్వరుని ఆరాధనకు ప్రత్యేకంగా కేటాయించబడింది. శివరాత్రి వ్రతంలో ముఖ్యంగా రెండు అంశాలు ప్రధానంగా చెప్పబడుతాయి. మొదటిది ఉపవాసం, రెండవది జాగరణ. ఈ రెండు సాధనాలు శరీరం, మనస్సు, ఆత్మను పవిత్రం చేస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తాయి. నేడు మహాశివరాత్రి (ఫిబ్రవరి 15).
ఉపవాసం అంటే ఏమిటి?:
శాస్త్రాల్లో ‘ఆహార నివృత్తిః ఉపవాసః’ అని ఉపవాసానికి నిర్వచనం. అంటే ఆహారాన్ని తినకుండా ఉండడమే ఉపవాసం. అయితే ఇది కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు.. ఇంద్రియ నియంత్రణ, మనస్సు ఏకాగ్రత, దైవచింతన కలయికే నిజమైన ఉపవాసం. ప్రతి ఒక్కరి శారీరక స్థితి వేరు కాబట్టి.. అందుకు అనుగుణంగా ఆచరించాలి. శరీరం సహకరించని వారు అల్పమైన, సాత్త్వికమైన, శుద్ధమైన ఆహారాన్ని స్వీకరించవచ్చు. శరీరం సహకరిస్తే మాత్రం పూర్ణ ఉపవాసం చేయడం ఉత్తమం.
Also Read
- Lepakshi: లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం వెనుక నిజం ఏంటి.. శతాబ్దాలుగా ఆశ్చర్యపరుస్తున్న నిర్మాణ రహస్యం!
- Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
- Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
- Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
జాగరణ తాత్త్విక అర్థం:
శివరాత్రి వ్రతంలో రెండవ ముఖ్యమైన అంశం జాగరణ. జాగరణ అంటే నిద్ర లేకుండా ఉండటం మాత్రమే కాదు.. దైవ ధ్యానం, జపం, భజనలు చేస్తూ రాత్రంతా పరమేశ్వరుని స్మరించటం. శాస్త్రాల ప్రకారం పరమేశ్వరుడు నిత్య జాగరణశీలుడు. ప్రళయకాలంలో సర్వ జగత్తూ నిద్రలోకి జారినా.. ఆయన మాత్రం చైతన్య స్వరూపుడిగా జాగరూకుడిగా ఉంటాడు. ఇది శివుడి జ్ఞానస్వరూపత్వానికి సంకేతం. శరీరం సహకరిస్తే జాగరణ చేయడం ఉత్తమం.
జాగరణ జ్ఞానానికి ప్రతీక:
పరమేశ్వరునికి అజ్ఞానం, మోహం వంటి లక్షణాలు లేవు. అందుకే ఆయనను నిత్యజాగృత చైతన్యంగా వర్ణిస్తారు. శివయ్యను అనుసరించే భక్తుడు కూడా జాగరణ ద్వారా తనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని.. జ్ఞానాన్ని పొందగలడని విశ్వాసం.
వ్రతాచరణ ద్వారా లభించే ఫలితాలు:
ఉపవాసం ద్వారా శరీరం శుద్ధి, జాగరణ ద్వారా మనస్సు శుద్ధి కలుగుతాయని ఆధ్యాత్మిక వేదాంతం చెబుతుంది. ఈ రెండు కలిసి భక్తుడిని దైవ చైతన్యానికి దగ్గర చేస్తాయి. శివరాత్రి రోజున ఈ విధంగా ఉపవాసం, జాగరణతో పరమేశ్వరుని ఆరాధించిన వారు ఆధ్యాత్మికంగా ధన్యులవుతారని భక్తుల నమ్మకం.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది)
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!