NTV Telugu Site icon

Historical Temple: ఆ ఆలయం రాత్రిపూట నగ్నంగా నిర్మాణం.. కానీ వారికి మాత్రం నో ఎంట్రీ..

Historical Temple

Historical Temple

Historical Temple: భారతదేశం దైవశక్తికి, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇక్కడి దేవాలయాలు కేవలం విశ్వాస కేంద్రాలు మాత్రమే కాదు. వాటిలోని శిల్ప సౌందర్యం యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ఇటువంటి అనేక పురాతన దేవాలయాల వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అటువంటి విశిష్టమైన దేవాలయం ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్‌లో ఉంది. ఈ ఆలయం మహానది ఒడ్డున ఉంది. ఇది పురాతన దేవాలయం. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయంలోకి చెల్లెళ్లు, అన్నలు ప్రవేశించడం నిషేధం. ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్‌లోని కస్డోల్ సమీపంలోని నారాయణపూర్ గ్రామంలోని శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది. సోదరులు, సోదరీమణులు కలిసి ఈ ఆలయాన్ని సందర్శించకూడదు. ఈ ఆలయం గిరిజన ఆచారాలతో ముడిపడి ఉంది. నారాయణ్ అనే ప్రధాన శిల్పి రాత్రిపూట పూర్తిగా నగ్నంగా ఆలయాన్ని నిర్మించేవాడని చెబుతారు. శిల్పి నారాయణ్ కు తన భార్య భోజనం తెచ్చేంది. అయితే ఆలయ శిఖర నిర్మాణానికి సమయం వచ్చినప్పుడు, ఒక వింత సంఘటన జరిగింది. ఒకరోజు నారాయణ్ అతని భార్యకు బదులుగా.. నారాయణ్ చెల్లెలు భోజనం తెచ్చింది.

Read also: Sangeetha: వారు కనీస గౌరవం కూడా ఇవ్వరు.. సంగీత సంచలన వ్యాఖ్యలు!

అప్పుడు నగ్నంగా పని చేస్తున్న శిల్పి నారాయణ అవమానంగా భావించాడు. దీతో నారాయణ్ గుడి శిఖరంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అన్నా చెల్లెల్లను ఆలయం లోపలికి అనుమంతించరు. ఈ పురాతన ఆలయానికి పూజలు, దర్శనం కోసం సోదరులు, సోదరీమణులు కలిసి వెళ్లరని పురాణాలు చెబుతున్నాయి. అన్నదమ్ములు కలసి వెళ్లకపోవడానికి గోడలపై లింగ శిల్పాలు కూడా కారణం. ఈ శివాలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తవ్వకాల్లో లభించిన విగ్రహాలను ఇందులో భద్రపరిచారు. ఈ ఆలయాన్ని ఆరు నెలల్లో నిర్మించారు. ఈ ఆలయాన్ని 7,8వ శతాబ్దాలలో కలచూరి పాలకులు నిర్మించారు. ఈ ఆలయం ఎరుపు, నలుపు ఇసుకరాయితో నిర్మించబడింది. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయంలో 16 స్తంభాలు ఉండగా, ఒక్కోదానిపై శిల్పాలు తయారు చేయబడ్డాయి. ఆలయం లోపల ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది.
Read also: Neem Infused Water: వేప నీరు తాగితే శరీరంలో ఇన్ని మార్పులా.?