Historical Temple: ఆ ఆలయం రాత్రిపూట నగ్నంగా నిర్మాణం.. కానీ వారికి మాత్రం నో ఎంట్రీ..
- ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శివాలయం..
- ఈ ఆలయాన్ని 7-8వ శతాబ్దాలలో కలచూరి పాలకులు నిర్మించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Historical Temple: భారతదేశం దైవశక్తికి, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇక్కడి దేవాలయాలు కేవలం విశ్వాస కేంద్రాలు మాత్రమే కాదు. వాటిలోని శిల్ప సౌందర్యం యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ఇటువంటి అనేక పురాతన దేవాలయాల వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అటువంటి విశిష్టమైన దేవాలయం ఛత్తీస్గఢ్లోని బలోదాబజార్లో ఉంది. ఈ ఆలయం మహానది ఒడ్డున ఉంది. ఇది పురాతన దేవాలయం. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయంలోకి చెల్లెళ్లు, అన్నలు ప్రవేశించడం నిషేధం. ఛత్తీస్గఢ్లోని బలోదాబజార్లోని కస్డోల్ సమీపంలోని నారాయణపూర్ గ్రామంలోని శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది. సోదరులు, సోదరీమణులు కలిసి ఈ ఆలయాన్ని సందర్శించకూడదు. ఈ ఆలయం గిరిజన ఆచారాలతో ముడిపడి ఉంది. నారాయణ్ అనే ప్రధాన శిల్పి రాత్రిపూట పూర్తిగా నగ్నంగా ఆలయాన్ని నిర్మించేవాడని చెబుతారు. శిల్పి నారాయణ్ కు తన భార్య భోజనం తెచ్చేంది. అయితే ఆలయ శిఖర నిర్మాణానికి సమయం వచ్చినప్పుడు, ఒక వింత సంఘటన జరిగింది. ఒకరోజు నారాయణ్ అతని భార్యకు బదులుగా.. నారాయణ్ చెల్లెలు భోజనం తెచ్చింది.
Read also: Sangeetha: వారు కనీస గౌరవం కూడా ఇవ్వరు.. సంగీత సంచలన వ్యాఖ్యలు!
Also Read
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. అప్పులు అస్సలు ఇవ్వొద్దు, తీసుకోవద్దు సుమీ!
- Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. కలిసి రానున్న ఆర్థిక లావాదేవీలు!
అప్పుడు నగ్నంగా పని చేస్తున్న శిల్పి నారాయణ అవమానంగా భావించాడు. దీతో నారాయణ్ గుడి శిఖరంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అన్నా చెల్లెల్లను ఆలయం లోపలికి అనుమంతించరు. ఈ పురాతన ఆలయానికి పూజలు, దర్శనం కోసం సోదరులు, సోదరీమణులు కలిసి వెళ్లరని పురాణాలు చెబుతున్నాయి. అన్నదమ్ములు కలసి వెళ్లకపోవడానికి గోడలపై లింగ శిల్పాలు కూడా కారణం. ఈ శివాలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తవ్వకాల్లో లభించిన విగ్రహాలను ఇందులో భద్రపరిచారు. ఈ ఆలయాన్ని ఆరు నెలల్లో నిర్మించారు. ఈ ఆలయాన్ని 7,8వ శతాబ్దాలలో కలచూరి పాలకులు నిర్మించారు. ఈ ఆలయం ఎరుపు, నలుపు ఇసుకరాయితో నిర్మించబడింది. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయంలో 16 స్తంభాలు ఉండగా, ఒక్కోదానిపై శిల్పాలు తయారు చేయబడ్డాయి. ఆలయం లోపల ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది.
Read also: Neem Infused Water: వేప నీరు తాగితే శరీరంలో ఇన్ని మార్పులా.?
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!