Hyderabad Bonalu: బోనం ఆధ్యాత్మిక సంబురం.. ఆరోగ్య రహస్యం కూడా..
- జూలై 6న ఆషాడమాసం ప్రారంభం..
- జూలై 7వ తేదీ ఆదివారం నుంచి బోనాలు ప్రారంభం..
- తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ..
- ఆధ్యాత్మిక కారణాలకు మించిన ఆరోగ్య రహస్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Bonalu: మనిషికి ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది. పంచభూతాలతో రూపొందించబడిన ఈ శరీరాన్ని మానవాతీత శక్తి నడిపిస్తుందని నమ్ముతారు. అందుకే జననం, జీవితం, మరణం అన్నీ చిత్రవిచిత్రాలే. వాటి వెనుక ఎన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నా అంతుచిక్కని సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని పూజించే రోజు బోనాలు. జూలై 6న ఆషాడమాసం ప్రారంభం కానుంది. జూలై 7వ తేదీ ఆదివారం నుంచి బోనాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగలో ఆధ్యాత్మిక కారణాలకు మించిన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. కొత్త కుండలో సగానికి సున్నం, పైభాగానికి నూనె రాసి, పసుపు, కుంకుమలు పూసి, చందనం పూస్తారు. ఘటాన్ని అన్నంతో నింపి, దాని చుట్టూ మామిడి, వేప ఆకులతో దండలు వేస్తారు. ఘటంపై దీపం వెలిగించడానికి మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి చుట్టుపక్కల అందరితో కలిసి వెళ్లి బోనం సమర్పిస్తారు.
Read also: B.Krishna Mohan: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే..?
Also Read
- Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ఆషాడం అంటే వర్షాకాలం ప్రారంభం… చిన్న చిన్న గుంతలు కూడా నీటితో నిండిపోతాయి. దీంతో తీవ్రమైన జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలే సమయం. అంటు వ్యాధులు వైరస్ల ద్వారా వ్యాపిస్తాయి. వైద్య శాస్త్రం పరిణతి చెందని కాలంలో ప్లేగు, కలరా, మశూచి వంటి మహమ్మారి బారిన పడి పిట్టల్లా చనిపోతున్నారు. దానినే గత్తర వచ్చింది అని చెప్పేవారుఈ విపత్తుల నుండి రక్షించాలని అమ్మవారిని పూజిస్తారు. ఊరు వాడను శుభ్రం చేయడం వల్ల సగం క్రిములు తరిమికొడితే… వేపాకు, పసుపు నీళ్లతో ఇన్ఫెక్షన్లను నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ప్రతి లోగిలి ముందు కల్లాపి చల్లడం, ముగ్గులు వేయండం వేపాకులు, పసుపు రాసుకోవడం వల్ల క్రిములు తొలగిపోతాయి. బోనం పాత్రలో బియ్యం, ఉల్లి, మిరియాలు, పరమానం వేసి మూతపెట్టి నూనె పోసి దీపం వెలిగించాలి. వంశం సుభిక్షంగా ఉండాలని, కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవించాలని సాక పోస్తారు. మశూచి వంటి వ్యాధుల నుంచి కాపాడుతుందంటారు.
Oily Skin Makeup Tips: జిడ్డు చర్మం ఉన్న అమ్మాయిలు ఇలా మేకప్ చేసుకుంటే చర్మం మెరుస్తుంది
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!