Hyderabad Bonalu: బోనం ఆధ్యాత్మిక సంబురం.. ఆరోగ్య రహస్యం కూడా..
- జూలై 6న ఆషాడమాసం ప్రారంభం..
- జూలై 7వ తేదీ ఆదివారం నుంచి బోనాలు ప్రారంభం..
- తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ..
- ఆధ్యాత్మిక కారణాలకు మించిన ఆరోగ్య రహస్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Bonalu: మనిషికి ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది. పంచభూతాలతో రూపొందించబడిన ఈ శరీరాన్ని మానవాతీత శక్తి నడిపిస్తుందని నమ్ముతారు. అందుకే జననం, జీవితం, మరణం అన్నీ చిత్రవిచిత్రాలే. వాటి వెనుక ఎన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నా అంతుచిక్కని సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని పూజించే రోజు బోనాలు. జూలై 6న ఆషాడమాసం ప్రారంభం కానుంది. జూలై 7వ తేదీ ఆదివారం నుంచి బోనాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగలో ఆధ్యాత్మిక కారణాలకు మించిన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. కొత్త కుండలో సగానికి సున్నం, పైభాగానికి నూనె రాసి, పసుపు, కుంకుమలు పూసి, చందనం పూస్తారు. ఘటాన్ని అన్నంతో నింపి, దాని చుట్టూ మామిడి, వేప ఆకులతో దండలు వేస్తారు. ఘటంపై దీపం వెలిగించడానికి మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి చుట్టుపక్కల అందరితో కలిసి వెళ్లి బోనం సమర్పిస్తారు.
Read also: B.Krishna Mohan: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే..?
Also Read
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
ఆషాడం అంటే వర్షాకాలం ప్రారంభం… చిన్న చిన్న గుంతలు కూడా నీటితో నిండిపోతాయి. దీంతో తీవ్రమైన జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలే సమయం. అంటు వ్యాధులు వైరస్ల ద్వారా వ్యాపిస్తాయి. వైద్య శాస్త్రం పరిణతి చెందని కాలంలో ప్లేగు, కలరా, మశూచి వంటి మహమ్మారి బారిన పడి పిట్టల్లా చనిపోతున్నారు. దానినే గత్తర వచ్చింది అని చెప్పేవారుఈ విపత్తుల నుండి రక్షించాలని అమ్మవారిని పూజిస్తారు. ఊరు వాడను శుభ్రం చేయడం వల్ల సగం క్రిములు తరిమికొడితే… వేపాకు, పసుపు నీళ్లతో ఇన్ఫెక్షన్లను నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ప్రతి లోగిలి ముందు కల్లాపి చల్లడం, ముగ్గులు వేయండం వేపాకులు, పసుపు రాసుకోవడం వల్ల క్రిములు తొలగిపోతాయి. బోనం పాత్రలో బియ్యం, ఉల్లి, మిరియాలు, పరమానం వేసి మూతపెట్టి నూనె పోసి దీపం వెలిగించాలి. వంశం సుభిక్షంగా ఉండాలని, కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవించాలని సాక పోస్తారు. మశూచి వంటి వ్యాధుల నుంచి కాపాడుతుందంటారు.
Oily Skin Makeup Tips: జిడ్డు చర్మం ఉన్న అమ్మాయిలు ఇలా మేకప్ చేసుకుంటే చర్మం మెరుస్తుంది
తాజావార్తలు
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!