Tata Motors: హ్యుందాయ్, మహీంద్రాను వెనక్కి నెట్టిన టాటా.. నెక్సాన్, సియెర్రా వల్లే ఈ ఘనత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రాలను దాటి దేశంలో రెండో అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారుగా నిలిచింది. నెక్సాన్ కాంపాక్ట్ SUVకు ఉన్న బలమైన డిమాండ్, తాజాగా మార్కెట్లోకి వచ్చిన సియెర్రా మోడల్ నుంచి వచ్చిన ప్రారంభ అమ్మకాలే దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వ వాహన నమోదు గణాంకాలు చెబుతున్నాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. FY26 మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ 1.89 లక్షల ప్యాసింజర్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసింది. అదే సమయంలో మహీంద్రా 1.80 లక్షలు, హ్యుందాయ్ 1.70 లక్షల యూనిట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేశాయి. దీంతో టాటా ఈ రెండు కంపెనీలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది. డిసెంబర్ 2025లో కూడా టాటా రెండో స్థానంలో నిలిచి, సంవత్సరం రెండో భాగంలో కనిపించిన వృద్ధిని కొనసాగించింది. అయితే మొత్తం 2025 ఏడాదిలో టాటా మోటార్స్ మూడో అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారుగానే నిలిచింది.
READ MORE: Russia-Ukraine: న్యూఇయర్ వేళ రష్యాపై భారీ డ్రోన్ దాడి.. 24 మంది మృతి
Also Read
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
- BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
- TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
ఈ ఏడాదిలో టాటా 5.92 లక్షల వాహనాలను విక్రయించగా, మహీంద్రా 6.07 లక్షల యూనిట్లు అమ్మింది. మారుతి సుజుకి మాత్రం ఎప్పటిలాగే మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. కాగా.. 2025 రెండో భాగంలో టాటా పనితీరు గణనీయంగా మెరుగుపడింది. దీనికి ప్రధాన కారణం నెక్సాన్. అక్టోబర్, నవంబర్ నెలల్లో నెక్సాన్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనంగా నిలిచింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉండటం వల్ల నెక్సాన్కు స్థిరమైన డిమాండ్ కొనసాగింది. అలాగే, 2025 చివర్లో మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చిన సియెరా SUV ప్రారంభ అమ్మకాలు కూడా టాటాకు లాభం చేకూర్చాయి. వాహన్ డేటా ప్రకారం, డిసెంబర్ 2025లో టాటా మోటార్స్ 51,963 యూనిట్లు విక్రయించింది. అదే నెలలో హ్యుందాయ్ 48,312 యూనిట్లు, మహీంద్రా 47,493 యూనిట్లు మాత్రమే అమ్మాయి. సరఫరా పరిస్థితులు మెరుగుపడటం, SUV మోడళ్ల శ్రేణి పెరగటం, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల్లో స్థిరమైన పనితీరు టాటాకు ఈ త్రైమాసికంలో బలంగా నిలిచేలా చేశాయి.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!