The Dark Side of Electric Vehicles: “నమ్మశక్యం కాని నిజం”.. ఎలక్ట్రిక్ కార్ల వల్లే అధిక కాలుష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Dark Side of Electric Vehicles: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన శ్రేణిలో వీటి వృద్ధి అధికంగా ఉంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో 2030 నాటికి మొత్తం వాహన విక్రయాల్లో 30 శాతం ఈవీలు ఉండాలన్నది కేంద్రం లక్ష్యం. దీని ద్వారా వాయు కాలుష్యం, ఇంధన దిగుమతుల తగ్గింపు సాధించవచ్చని కేంద్రం భావిస్తోంది. కానీ.. దీని వెనుక “నమ్మశక్యం కాని నిజం”కాని మరో నిజం ఉంది.. నిజానికి పెట్రోల్-డీజిల్ కార్ల కంటే ఈ వాహనాల వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని కలుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ప్రక్రియ, వాటి బ్రేక్లు, టైర్లు లేదా వాటి బ్యాటరీలు ఊహించలేనంత కాలుష్యాన్ని కలిగిస్తాయి. ఎలా, ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం.
READ MORE: Nubia Fold, Nubia Flip3 రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసిన నుబియా.. ఫీచర్స్ ఇవే..!
Also Read
- Toyota Urban Cruiser EV: భారత మార్కెట్లోకి టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV.. 543KM రేంజ్! ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు
- Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
- టెస్లా లవర్స్కి గుడ్ న్యూస్.. రూ.9 లక్షల తగ్గింపుతో మార్కెట్లోకి సరికొత్త Tesla Model Y మోడల్.. ఫీచర్స్ అదుర్స్!!
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
ఈవీ, సాధారణ ఇంజిన్ల ఉద్గారాలను పోల్చినప్పుడు.. ఈవీలను ఉత్పత్తి చేసేటప్పుడు 46 శాతం కార్బన ఉద్గారాలు వస్తున్నట్లు కనుగొన్నారు. సాధారణ వాహనాల్లో ఇది 26 శాతంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎలక్ట్రిక్ కారును తయారు చేసే ప్రక్రియలో దాదాపు 5-10 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. ఇది పర్యావరణానికి చాలా ప్రమాదం.. ఈవీ, సాధారణ వాహనంలో బాడీ, ఛాసిస్, ఇతర భాగాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. వాటి తయారీలో అల్యూమినియం, స్టీల్ వంటి లోహాలను ఉపయోగిస్తారు. అయితే ఈవీ బ్యాటరీతో నడుస్తుంది. వీటిల్లో లిథియం అయాన్ బ్యాటరీలు ఉపయోగిస్తారు. ఇవి భూమిలో లభించే అరుదైన లోహాలతో తయారు చేస్తారు. ఐఎమ్ఎఫ్ నివేదిక ప్రకారం.. సాధారణ ఈవీ బ్యాటరీని తయారు చేయడానికి 8 కిలోల లిథియం, 35 కిలోల మాంగనీస్, 6 నుంచి 12 కిలోల కోబాల్ట్ అవసరం. వీటిలో, కోబాల్ట్ అరుదైన ఎర్త్ మెటల్. ఇది సులభంగా లభ్యం కాదు. కాబట్టి బ్యాటరీ తయారీలో దాని పరిమాణాన్ని తగ్గించడానికి కోబాల్ట్ కంటే చౌకైన నికెల్ను ఉపయోగిస్తారు. ఒక్క బ్యాటరీ తయారీలో ఇవన్నీ ఉపయోగిస్తారు. అయితే ఈ లోహాల మైనింగ్ అతిపెద్ద పర్యావరణ ఆందోళన. లిథియం, కోబాల్ట్ వంటి లోహాలను భూమి నుంచి తీస్తే 4,275 కిలోల యాసిడ్ వ్యర్థాలు, 57 కిలోల రేడియోధార్మిక అవశేషాలు ఉత్పత్తి అవుతాయి.
READ MORE: Pamela Satpathy: “మీరు సూపర్ మేడం”.. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంచే పాట పాడిన కలెక్టర్..
లిథియం ఎందుకు ప్రమాదకరం?
ఒక టన్ను లిథియం దాదాపు 100 ఈవీ వాహనాలకు బ్యాటరీలను తయారు చేయగలదు. అయితే ఈ ఒక టన్ను లిథియంను వెలికితీయాలంటే 2 మిలియన్ టన్నుల నీరు అవసరం. ఒక ఈవీకి చెందిన బ్యాటరీ తయారీకి 13,500 లీటర్ల నీటిని వినియోగిస్తారు. అయితే పెట్రోల్ కారు దాదాపు 4,000 లీటర్లు వినియోగిస్తుంది. దీని వల్ల చిలీ, బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఒక్క చిలీలో 65 శాతం నీటిని లిథియం తీయడానికి వాడుతున్నారు. నికెల్, కోబాల్ట్ గనులు ఉన్న క్యూబాలో దాదాపు 570 హెక్టార్ల భూమి బీడుగా మారింది. 10 కిలోమీటర్లకు పైగా ప్రాంతం కలుషితమైంది. అధిక కాలుష్యం కారణంగా ఫిలిప్పీన్స్ 23 నికెల్, కోబాల్ట్ గనులను మూసివేయవలసి వచ్చింది. అల్యూమినియం గురించి మాట్లాడినట్లయితే.. ఈవీ తయారు చేయడానికి సుమారు 250 కిలోల అల్యూమినియం ఉపయోగించబడుతుంది. ఇది సగటు పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్ కంటే 25-27% ఎక్కువ. 2030 నాటికి ఈవీ పరిశ్రమ డిమాండ్ను తీర్చడానికి 10 మిలియన్ టన్నుల అల్యూమినియం అవసరం అవుతుంది.
ఛార్జింగ్ ప్రక్రియ సైతం ప్రమాదమే..
ఈవీ ఛార్జింగ్ పర్యావరణానికి చాలా అనుకూలంగా కనిపించడం లేదు. ప్రజలు ఇంట్లో లేదా ఛార్జింగ్ స్టేషన్లలో ఈవీలను ఛార్జ్ చేస్తారు. అయితే వాటికి ఛార్జ్ చేస్తున్న విద్యుత్ ఎక్కడ, ఎలా ఉత్పత్తి అవుతోంది? రికార్డో కన్సల్టెన్సీ ప్రకారం.. బొగ్గుతో ఉత్పత్తి చేయబడిన విద్యుత్తో ఈవీని ఛార్జ్ చేస్తే, 1.5 లక్షల కిలోమీటర్లు నడిపిన తర్వాత, అది పెట్రోల్ కారు కంటే 20% తక్కువ కార్బన్ను మాత్రమే విడుదల చేస్తుంది. భారతదేశంలో 70% విద్యుత్ బొగ్గు నుంచి ఉత్పత్తి చేస్తారు.
చెడిపోయిన బ్యాటరీలతో ముప్పు!
బ్యాటరీ జీవితం ముగిసినప్పుడు.. వాటిని పారేయాల్సి ఉంటుంది. లేదా పల్లపు ప్రదేశాలలో పాతి పెట్టాలి. ఇది పర్యావరణానికి మరింత ప్రమాదకరం. ఇది కార్బన్ వ్యప్తిని మరింత పెంచుతుంది. బ్యాటరీలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. కొన్ని కంపెనీలు బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినప్పటికీ.. మొత్తం బ్యాటరీలలో 5 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. లిథియం ప్రపంచంలోనే అత్యంత తేలికైన లోహం అని అరిజోనా విశ్వవిద్యాలయం ఎకాలజీ విభాగానికి చెందిన ఎమెరిటస్ ప్రొఫెసర్ గై మెక్ఫెర్సన్ చెప్పారు. “ఇది చాలా సులభంగా ఎలక్ట్రాన్లను వదులుతుంది. లిథియం గ్రీన్ ఫ్యూయల్ అని కీర్తించబడుతోంది. కానీ దానిని భూమి నుంచి తీయడం పర్యావరణానికి 3 రెట్లు ఎక్కువ విషపూరితం. 98.3% లిథియం బ్యాటరీలను ఉపయోగించిన తర్వాత గుంతల్లో పాతిపెట్టాల్సి వస్తుంది. బ్యాటరీ పాడయ్యాక నీటితో చర్య జరుపుతుంది. ఒక వేళ దానికి నీరు తగిలితే.. వెంటనే మండుతుంది. జూన్ 2017 నుంచి డిసెంబర్ 2020 వరకు.. అమెరికాలోని పసిఫిక్ నార్త్వెస్ట్లోని ఒక పిట్లో ఈ బ్యాటరీల నుంచి 124 ప్రమాదాలు జరిగాయి.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: Pamela Satpathy: “మీరు సూపర్ మేడం”.. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంచే పాట పాడిన కలెక్టర్..
ఇతర ఇంధనాలతో నడిచే కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల బ్రేక్లు, టైర్లు 1850 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని వ్యాపింపజేస్తాయని ఓ పరిశోధన నివేదిక పేర్కొంది. ఎమిషన్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ఈ అదనపు బరువు బ్రేక్లు, టైర్లపై పడి వాటి జీవితకాలం వేగంగా తగ్గిపోతుంది. అధిక బరువు కారణంగా దాని టైర్లు త్వరగా అరిగిపోతాయి. త్వరగా అరిగిపోయిన టైర్లు హానికరమైన రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తాయి. చాలా టైర్లు సింథటిక్ రబ్బరుతో తయారు చేస్తారు. ఇవి కాలుష్యానికి ప్రమాదం. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో అమర్చిన ఈ అర టన్ను బ్యాటరీ పెట్రోల్ కారు కంటే 400 రెట్లు ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుందని నివేదిక వెల్లడించింది.
ఎకో ఫ్రెండ్లీ అని ఎలా అంటారు?
ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఈవీలను ఎకో ఫ్రెండ్లీ అని ఎలా అంటారు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈవీ కార్ల తయారీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అందుకే ఇందులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ఈవీలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే విద్యుత్ బొగ్గు నుంచి తీసుకోకపోతే, మైనింగ్ ప్రక్రియను డీకార్బనైజ్ చేసినట్లయితే ఈవీలు పర్యావరణ అనుకూలమైనవిగా మారవచ్చు. దాని బ్యాటరీని రీసైకిల్ చేయడానికి, చెడిపోయిన బ్యాటరీలను సురక్షితంగా మట్టిలో కలిసి పోయేలా చేస్తే.. ఈవీలు కూడా ప్రకృతికి మేలు చేసేవిగా తయారవుతాయి. ఈవీల తయారీ ప్రారంభదశలోనే ఉంది. కాబట్టి ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
-
Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
-
Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!