Ola S1 X+ Launched: ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కొత్తగా S1 X+ 5.2 kWh అనే కొత్త స్కూటర్ వేరియంట్ను భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త స్కూటర్ లో కంపెనీ స్వదేశీగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీని వినియోగించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీ ద్వారా అధునాతన బ్యాటరీ సామర్థ్యాన్ని సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా పెట్టుకుంది.
430 సీసీ కెమెరాలు, 2000 పోలీసుల గస్తీ మధ్య ఉప్పల్ వేదికగా SRH vs RR మ్యాచ్..!
Ola S1 X+ 5.2 kWh స్కూటర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల (IDC) వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఇందులో 11 kW మిడ్-డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ (MCU) ఉన్నాయి. ఈ స్కూటర్ గరిష్టంగా 125 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ స్కూటర్లో బ్రేక్-బై-వైర్ టెక్నాలజీతో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. ఇవి రోజువారీ వినియోగంలో మెరుగైన కంట్రోల్, భద్రతను అందిస్తాయి.
ఈ లాంచ్ ద్వారా ప్రీమియం మోడల్స్లో మాత్రమే ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ఇప్పుడు మాస్ సెగ్మెంట్లోకి తీసుకురావడమే కంపెనీ లక్ష్యంగా ఉంది. రేంజ్ సమస్య (range anxiety), ధర వంటి అంశాలు EVల వినియోగానికి ప్రధాన అడ్డంకులు కాగా, ఈ కొత్త మోడల్ వాటిని అధిగమించేలా రూపొందించబడింది. సెల్ డెవలప్మెంట్ నుంచి వాహన తయారీ వరకు అన్నింటినీ స్వయంగా నిర్వహించడం ద్వారా ఖర్చులను తగ్గిస్తూ, కొత్త టెక్నాలజీలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. దీనినే ‘వర్టికల్ ఇంటిగ్రేషన్’గా పిలుస్తారు.
Trisha: నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు
ఇప్పటికే Ola వద్ద S1 Pro+, S1 Pro వంటి ప్రీమియం స్కూటర్లతో పాటు, S1 X సిరీస్లో పలు వేరియంట్లు ఉన్నాయి. అంతేకాకుండా రోడ్ స్టర్ (Roadster) సిరీస్ ద్వారా మోటార్సైకిల్ సెగ్మెంట్ లో కూడా ప్రవేశించింది. S1 X+ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999గా నిర్ణయించగా, ఈ ఆఫర్ ధర ఏప్రిల్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
