మేం అట్టా ప్లాన్ వేయగానే…. అవతలోళ్ళకి ఇట్టా ఎట్టా తెలిసిపోతోంది? పక్కనే ఉంటూ వెన్నుపోట్లు పొడిచే బ్యాచ్ ఎక్కువైపోతోందా అని తెగ టెన్షన్ పడుతున్నారట ఆ ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు. పైకి అంతా మనోళ్ళే అనిపిస్తున్నా… ఎవర్ని ఎంత వరకు నమ్మాలో అర్ధంగాక బుర్రలు గోక్కుంటున్నారట. నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ జిల్లాలో ఉన్నారు? ఏంటా కథ? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు అత్యంత సన్నిహితులను చూసినా భయపడుతున్నారట. […]
అసెంబ్లీ ఎన్నికల్లోకి ఫ్రషర్గా ఎంటరై మహామహుల్ని మట్టికరిపించిన చరిత్ర ఆ ఎమ్మెల్యేది. కానీ… ఇప్పుడాయనకు అంతకు మించిన అగ్ని పరీక్ష ఎదురవబోతోంది. అప్పుడు కాదు… ఇప్పుడు చూపించు నీ సత్తా అంటూ సవాల్ విసురుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు. నీ జెయింట్ కిల్లర్ మేజిక్ ఏంటో చూస్తామంటూ తొడగొడుతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ విషయంలో ఆయనకు సవాళ్ళు ఎదురవుతున్నాయి? ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా మారిందట కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి […]
తెలుగుదేశం పార్టీలో అసమ్మతులు, అసంతృప్తులు కంప్లీట్గా చల్లారిపోయినట్టేనా? అందరికీ జిందా తిలిస్మాత్లాగా… కలిసి పనిచేయండని చంద్రబాబు ఒక్క మాట చెప్పగానే… ఆల్ సెట్ అయిపోయిందా? పార్టీ పెద్దలు నమ్ముతున్నదేంటి? క్షేత్ర స్థాయిలో జరుగుతున్నదేంటి? అమరావతిలో ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్ళడం మినహా మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్న వాదనలో నిజమెంత? ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్స్కుగాను 31 నియోజకవర్గాలను పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించింది టీడీపీ. ఇక మరో 30కు పైగా సెగ్మెంట్లల్లో టిక్కెట్ ఆశించి […]
ఖమ్మంలో బుధవారం ‘కార్బైడ్ రహిత మామిడి మేళా’ను వనజీవి రామయ్య ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన రైతు బానోతు లక్ష్మణ్నాయక్ పెవిలియన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న మేళాలో సహజసిద్ధంగా పండిన వివిధ రకాల మామిడి పండ్లను సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తున్నారు. మేళాను ప్రారంభించిన అనంతరం రామయ్య మాట్లాడుతూ కార్బైడ్ రహిత మామిడి పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదని, కృత్రిమ పదార్థాలతో పండిన మామిడి పండ్లను నివారించాలని, అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని […]
చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్మోహన్ రెడ్డి పని చేశారు.. సుమారు 2000 కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. గురజాల నియోజకవర్గంలో ఇంటింటికి కులాయి కార్యక్రమం 50 శాతం పూర్తి చేయగలిగాం.. మరొక 50 శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు అని పేర్కొన్నారు. పిడుగురాళ్ల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, బైపాస్ నిర్మాణాలు చేశాం.. సంక్షేమ కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం […]
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తుక్కుగూడ సభలో రాహూల్ గాంధీ నోటి చేత పచ్చి అబద్ధాలు మాట్లాడించారన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాపం రాహుల్ గాంధీకి ఏం తెలియదు రేవంత్ రెడ్డి ఏం చెప్పితే అది మాట్లాడి పోయాడని, బీఆర్ఎస్ హయంలోనే 503 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం….. వీటికీ మరో 60 ఉద్యోగాలు కలిపి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. నిరుద్యోగులు ఇవ్వన్ని గమనిస్తున్నారని, టెట్ పరీక్ష […]
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో గల్లి నుంచి జిల్లా పరిషత్ వరకు కాంగ్రెస్ నాయకులే ఉండాలే అన్నారు. నాగ మడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను మా ఎమ్మెల్యే లక్ష్మి కాంతరావు ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని, ఇప్పటికే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. కుల గణన రావాలంటే […]
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకట్ రామి రెడ్డి, పటన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గణేశ్ గడ్డ బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన అడ్డ అని […]
భారత రాజ్యాంగం ప్రకారం మనది లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య దేశం. ఇందులో మొదటిదైన లౌకిక అనే పదానికి విస్తృత అర్థాన్ని ప్రబోధించారు రాజ్యాంగకర్తలు. మతం అనేది వ్యక్తిగతం, ఎవరికి నచ్చిన మతాన్ని వారు అనుసరించొచ్చు, దాన్ని ఆచరించవచ్చు. కానీ ఇతరుల మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వారి మత విశ్వాసాలకు భంగం కలిగించకూడదు. ఇదే రకంగా ప్రభుత్వం కూడా అన్ని మతాలనూ సమ దృష్టితో చూడాలి. అదే సమయంలో మతాన్ని రాజకీయాలతో ముడి పెట్టకూడదు. మతం విషయంలో […]
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావు పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫిరాయింపులను ప్రోత్సహించింది నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. రేగా కాంతారావు ను కాంగ్రెస్ గెలిపిస్తే పార్టీ ఫిరాయించింది నిజం కాదా అని ఆమె అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ ఫిరాయించారని అంటున్న రేరా కాంతారావు చేసింది ఏమిటి… నువ్వు ఫిరాయిస్తే అభివృద్ధి కోసం వేరే వాళ్ళ పై విమర్శలు చేసే అర్హత రేగా కాంతారావు […]