Sajjal Ramakrishna Reddy: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. రేపు నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ
- వైసీపీ ముఖ్యనేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి టెలికాన్ఫరెన్స్..
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ, రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన..
- పార్టీ కమిటీల నిర్మాణం, సంస్థాగతంగా బలోపేతంపై సీరియస్గా దృష్టి పెట్టాం: సజ్జల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjal Ramakrishna Reddy: వైసీపీ ముఖ్యనేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ, రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ముందు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ కమిటీల నిర్మాణం, సంస్థాగతంగా బలోపేతం చేయడంపై నాయకులంతా సీరియస్గా దృష్టి సారించాలి.. కమిటీల నిర్మాణం, మైక్రో లెవల్ ప్లానింగ్పై మనం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలి అని సూచించారు. సెంట్రలైజ్డ్ డేటా ప్రొఫైలింగ్ కేంద్ర కార్యాలయం నుంచి జరుగుతుంది అన్నారు. నిబద్దతతో, చురుగ్గా పని చేసే వారిని గుర్తించి కమిటీలలో ప్రాధాన్యతం ఇవ్వాలని సజ్జల సూచించారు.
Read Also: Pakistan Gifts Turkiye: తుర్కియేకి పాక్ గిఫ్ట్.. వెయ్యి ఎకరాల భూమి ఉచితం..
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
ఇక, పుంగనూరు, మడకశిర నియోజకవర్గాలలో పైలెట్ ప్రాజెక్ట్గా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్ధాయి వరకు కమిటీలను నెట్వర్క్ పరిధిలోకి తీసుకు రావడం జరిగింది అని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఇటీవల పుంగనూరులో జరిగిన సమావేశం చాలా మంచి వాతావరణంలో జరిగింది.. క్రియాశీలకంగా ఉండే ముఖ్యమైన నాయకులంతా కసరత్తు చేసి ఈ కమిటీలను నియమించుకున్నారు.. కమిటీల నిర్మాణం ఎంత ముఖ్యమో దానికి సంబంధించిన స్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యం అన్నారు. పని చేయాలనుకునే వారిని అందరినీ గుర్తించడం, వారికి తగిన ప్రాధాన్యతనివ్వడం మనం చేయాల్సిన పని.. ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గాలను ఒక్క యూనిట్ గా తీసుకోవాలి అన్నారు. ఇలా నెట్వర్క్ రూపొందించి ఒక్కో నియోజకవర్గం నుంచి 8 వేల మందిని ఈ సిస్టమ్ లోకి తీసుకురావాలని రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.
Read Also: Student: హోం వర్క్ చేయలేదని.. 2వ తరగతి విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసి కొట్టిన వైనం..
అయితే, సంక్రాంతి నాటికి అందరికీ పార్టీ గుర్తింపు కార్డులు అందజేసేలా కార్యాచరణ రూపొందిస్తామని సజ్జల పేర్కొన్నారు. అన్ని స్థాయిల నాయకత్వం సమన్వయంతో పని చేయాలి.. ఇందుకు అవసరమైన వర్క్షాప్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీకి సంబంధించిన ఐటీ, సోషల్ మీడియా వింగ్స్ సహకారం తీసుకుని ముందుకెళ్లాలి.. పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో 15, గ్రామ స్థాయిలో 7 కమిటీల నియామకం పక్కాగా జరగాలి అని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలియజేశారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..