Sajjal Ramakrishna Reddy: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. రేపు నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ
- వైసీపీ ముఖ్యనేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి టెలికాన్ఫరెన్స్..
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ, రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన..
- పార్టీ కమిటీల నిర్మాణం, సంస్థాగతంగా బలోపేతంపై సీరియస్గా దృష్టి పెట్టాం: సజ్జల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjal Ramakrishna Reddy: వైసీపీ ముఖ్యనేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ, రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ముందు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ కమిటీల నిర్మాణం, సంస్థాగతంగా బలోపేతం చేయడంపై నాయకులంతా సీరియస్గా దృష్టి సారించాలి.. కమిటీల నిర్మాణం, మైక్రో లెవల్ ప్లానింగ్పై మనం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలి అని సూచించారు. సెంట్రలైజ్డ్ డేటా ప్రొఫైలింగ్ కేంద్ర కార్యాలయం నుంచి జరుగుతుంది అన్నారు. నిబద్దతతో, చురుగ్గా పని చేసే వారిని గుర్తించి కమిటీలలో ప్రాధాన్యతం ఇవ్వాలని సజ్జల సూచించారు.
Read Also: Pakistan Gifts Turkiye: తుర్కియేకి పాక్ గిఫ్ట్.. వెయ్యి ఎకరాల భూమి ఉచితం..
Also Read
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
ఇక, పుంగనూరు, మడకశిర నియోజకవర్గాలలో పైలెట్ ప్రాజెక్ట్గా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్ధాయి వరకు కమిటీలను నెట్వర్క్ పరిధిలోకి తీసుకు రావడం జరిగింది అని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఇటీవల పుంగనూరులో జరిగిన సమావేశం చాలా మంచి వాతావరణంలో జరిగింది.. క్రియాశీలకంగా ఉండే ముఖ్యమైన నాయకులంతా కసరత్తు చేసి ఈ కమిటీలను నియమించుకున్నారు.. కమిటీల నిర్మాణం ఎంత ముఖ్యమో దానికి సంబంధించిన స్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యం అన్నారు. పని చేయాలనుకునే వారిని అందరినీ గుర్తించడం, వారికి తగిన ప్రాధాన్యతనివ్వడం మనం చేయాల్సిన పని.. ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గాలను ఒక్క యూనిట్ గా తీసుకోవాలి అన్నారు. ఇలా నెట్వర్క్ రూపొందించి ఒక్కో నియోజకవర్గం నుంచి 8 వేల మందిని ఈ సిస్టమ్ లోకి తీసుకురావాలని రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.
Read Also: Student: హోం వర్క్ చేయలేదని.. 2వ తరగతి విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసి కొట్టిన వైనం..
అయితే, సంక్రాంతి నాటికి అందరికీ పార్టీ గుర్తింపు కార్డులు అందజేసేలా కార్యాచరణ రూపొందిస్తామని సజ్జల పేర్కొన్నారు. అన్ని స్థాయిల నాయకత్వం సమన్వయంతో పని చేయాలి.. ఇందుకు అవసరమైన వర్క్షాప్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీకి సంబంధించిన ఐటీ, సోషల్ మీడియా వింగ్స్ సహకారం తీసుకుని ముందుకెళ్లాలి.. పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో 15, గ్రామ స్థాయిలో 7 కమిటీల నియామకం పక్కాగా జరగాలి అని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలియజేశారు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఒకసారి కాదు..2సార్లు కాదు..ఏకంగా 30సార్లు.. హిట్మ్యాన్ ఖాతాలో వింత రికార్డు!
-
Vaibhav Suryavanshi: ‘నేనే ఇండియా కోచ్ అయితే వైభవ్ని పీకి పక్కన పెట్టేవాడిని..’టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
-
US Iran deal 2026: అమెరికా-ఇరాన్ వివాదానికి ముగింపు.. అవగాహన ఒప్పందంపై సంతకాలు
-
Astrology: ఎవరినైనా సులభంగా నమ్మే 4 రాశులు.. అందుకే ఎక్కువసార్లు మోసపోతారా?
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
ట్రెండింగ్
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!