NTV Telugu Site icon

YSRCP: వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెల్‌ఫోన్ చోరీ

Margani Bharat

Margani Bharat

రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెల్‌ఫోన్ చోరీకి గురైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటనలో ఎంపీ మార్గాని భరత్ పాల్గొనగా.. ఆయన ఫోన్‌ను దుండగులు కొట్టేసినట్లు తెలుస్తోంది. తన ఫోన్ చోరీకి గురైందన్న విషయంపై ఎంపీ భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరగా రాజమండ్రి ఎయిర్‌పోర్టులోని హెర్బల్ షాపులో పని చేసే యువతితో ఆయన తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఫోన్ కనిపించలేదని ఎంపీ భరత్ వివరించారు. ఎంపీ వ్యక్తిగత సమాచారం అంతా సెల్‌ఫోన్‌లో ఉండటంతో కోరుకొండ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు.

Read Also: PM Modi-Pawan Kalyan: మోడీ సభకు పవన్‌ రాకపోవటానికి కారణం ఇదే..!

కాగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎంపీ మార్గాని భరత్ ఫోన్ ఓ యువతి ఇంటిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు యువతి ఇంటికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎంపీ సెల్‌ఫోన్ చోరీ అంటూ పోలీసులు తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు సదరు యువతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో యువతి వెనుతిరిగింది.