పవర్ లేని ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్.. అమర్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో వైసీపీ నేతలపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పవన్ వైసీపీ నాయకులను నిందించడానికి విశాఖ వచ్చారా? అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆస్తి అనుకుంటున్నారా లేక రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అనుకుంటున్నారో పవన్ సమాధానం చెప్పాలి.
32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. గత కొన్ని నెలలు గా విశాఖ ఉక్కు కోసం ఉద్యమాల జరుగుతుంటే పవన్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? పవన్ మాటలు విని మోసపోయే ప్రజలు ఈ రాష్ట్రంలో లేరు. అందుకే గాజువాకలో పవన్ ఓడిపోయారు. గాజువాక లో నన్ను ఓడించారు ..నన్ను గెలిపిస్తే పోరాటం చేసేవాన్ని అని అందరి ముందు చెప్పారు. ఎంత కాలం ప్రజలకు సినిమా డైలాగులు చెబుతారు. పవన్ రాకపోయినా ఉక్కు ఉద్యమం నడుస్తుంది. వైసీపీ ముందుండి నడిపిస్తుందన్నారు అమర్నాథ్.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
గతంలో ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఉక్కు కార్మికులను కలిశారు. కార్మికులు చెప్పిన విషయాలను అసెంబ్లీలో తీర్మానం చేశారు. పవన్ సభ లో మోదీ కోసం ఒక్క మాట అయిన మాట్లాడారా? పవన్ కు దమ్ము ఉంటే ఢిల్లీ లో స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చెయ్యాలి. పవన్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. పవన్ కు స్థిరత్వం లేదన్నారు అమర్నాథ్.
ఇప్పటికి వరకు పవన్ మూడు పార్టీలు మార్చారు. మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి అని వైసీపీ కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించి తొమ్మిది నెలలు అవుతున్న పవన్ ఏం చేస్తున్నారు. తిరుపతి లో బై ఎలెక్షన్లు జరిగితే ఎందుకు బీజేపీ కి మద్దతు తెలిపారు. అప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. గాజువాక ప్రజలు ఓడించారు అనే అక్కసుతో పవన్ ఇలా వ్యవహరిస్తున్నారు.
పవన్ విశాఖ ఉక్కు నష్టాలలో ఉంది అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఉక్కు కార్మికులు ఈ విషయాన్ని గమనించి ఖండించాలి. బీజేపీ అజెండా ను పవన్ బహిరంగ సభ లో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు నష్టాలలో ఉంటే వైసీపీ పరిశ్రమ లాభాలలో ఉంది అని పవన్ అంటున్నారు. అధికార పక్షంలో ,ప్రతిపక్షం లో లేకుండా అధికగా డబ్బులు సంపాదించిన వ్యక్తి పవన్. అందుకే ఆయన ను ప్యాకేజీ స్టార్ అంటారు. సిద్ధాంతం లేని నాయకుడు పవన్ కళ్యాణ్. పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీని విమర్శించే హక్కు పవన్ కు లేదన్నారు ఎమ్మెల్యే అమర్నాథ్.
తాజావార్తలు
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!