CM Chandrababu: గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది..
- ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వస్తున్నాం..
- రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశాం..
- గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది..
- రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నా.. హామీలు అమలు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పెండ్లిమర్రిలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడపలో మహానాడు సూపర్ సక్సెస్ చేశారు.. కడప గడ్డపై మన సత్తా నిరూపించారు.. సూపర్ సిక్స్ హామీలు సాధ్యమా అన్నారు. కానీ అన్నీ హామీలు అమలు చేస్తున్నాం.. 17 నెలల్లో సూపర్ సిక్స్- సూపర్ హిట్ అయిందన్నారు. అలాగే, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, 20 లక్షల మందికి ఉద్యోగాలు, అన్నదాత సుఖీభవ పథకాలు అన్ని హిట్ అయ్యాయని పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కలిసి చేస్తున్నాం.. ఇవాళ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Omar Abdullah: కొందరు చేసిన ఉగ్రదాడికి మొత్తం కాశ్మీరీలకు అవమానాలు..
Also Read
అయితే, ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులతో కళకళలాడుతోంది అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రైతు సేవా కేంద్రాల నుంచి హాజరైన అన్నదాతలకు అభినందనలు తెలియజేస్తున్నాను.. రైతులకు ఏడాదికి 20 వేల రూపాయలను ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రెండో విడత ఇస్తున్నాం.. రెండో విడతలో రూ. 3, 135 కోట్లు జమ అయ్యాయి.. డైరెక్ట్ గా నగదు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి అని సూచించారు. ప్రతి ఒక్క రైతు అన్నదాత సుఖీభవ నిధులు వచ్చాయే లేదో మెసేజ్ చెక్ చేస్కోవాలని తెలిపారు. 46 లక్షలకు పైగా ఉన్న అన్నదాతలకు నిధులు జమ అయ్యాయి.. మన రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది.. చెప్పిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా నగదు వేస్తున్నాం.. మా చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.. రైతు భవిష్యత్ మార్చే మార్పు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Property Dispute: ఆస్తికోసం అమానుషం.. దత్తపుత్రుడి హక్కును అడ్డుకున్న సొంత సోదరుడు!
ఇక, రాష్ట్రంలో ఏ పంట వెయ్యాలో కూడా రైతులకు యాప్ నుంచే చెప్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమలో ఉద్యాన వన పంటలు బాగా పండించాలి.. అరకు కాఫీ నేనే ప్రమోట్ చేశా.. అరకు కాఫీ, ప్రపంచంలోనే బెస్ట్ కాఫీగా నిలిచింది.. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పామాయిల్ వేస్తున్నారు.. కోకో ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ఏపీ.. కోనసీమలో కోకొనట్ ఉంది.. కోకో, కాఫీ, కోకొనట్ ఈ మూడు కాంబినేషన్లో ఆహారం తయారు అవుతుంది.. రాయలసీమ హార్టీకల్చర్ హబ్ అవ్వాలని కోరారు. ప్రపంచంలో ఉన్న కంపెనీలు త్వరలోనే రాయలసీమకు రావాలని చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!