YSR Free Crop Insurance: వైఎస్సార్ ఉచిత పంటల బీమా –వరసగా మూడో ఏడాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏరువాకతో సాగుకు సన్నద్దమవుతున్న అన్నదాతకు అండగా, 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ఈ ఖరీఫ్ ప్రారంభంలోనే రూ. 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్ధిక భారం లేకుండా, రైతుల తరపున పూర్తి ప్రీమియం బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని, సాగుచేసిన ప్రతి ఎకరాన్ని ఈ–క్రాప్లో మన గ్రామంలోనే ఆర్బీకేల ద్వారా నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తోంది. బీమా పరిహారపు సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తోంది. దీని ద్వారా ఉచిత పంటల బీమా ఒక సీజన్ది మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే క్రమం తప్పకుండా చెల్లిస్తోంది జగన్ సర్కార్.
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
గతంలో బీమా క్లెయిమ్లు ఎప్పుడొస్తాయో, ఎంతొస్తాయో, ఎంతమందికొస్తాయో కూడా తెలియని అయోమయం వుండేది. ఈ ప్రభుత్వంలో మాత్రం గత ఖరీఫ్ సీజన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయానికే చెల్లింపులు జరుగుతున్నాయి. ఆర్బీకేల ద్వారా పంట వేసినప్పుడే ఈ–క్రాప్లో నమోదు చేసి రసీదు, ఏ ఒక్కరూ మిస్ కాకూడదని ఆయా గ్రామాలలోనే సోషల్ ఆడిట్ కొరకు పేర్లు డిస్ప్లే చేస్తారు. పొరపాటున ఎవరైనా మిస్ అయితే వారికి కూడా ఇవ్వాలన్న తపన, ఇంత వేగంగా బీమా పరిహారం చెల్లింపులు జరగడం దేశంలోనే మొదటిసారి.
ఈప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారానే పంట వేసినప్పుడే ఈ–క్రాప్లో నమోదు చేయించి శాస్త్రీయంగా, అర్హులెవ్వరూ మిగిలిపోకుండా పంట నష్టాల అంచనా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం నేరుగా వారి ఖాతాల్లో జమ కానుంది.
గత ప్రభుత్వంలో చెల్లింపులు…
2014 – 15– 1.03 (లబ్ధిదారులు లక్షల్లో) 132.24 (పరిహారం రూ. కోట్లలో)
2015 –16 – 4.35 (లబ్ధిదారులు లక్షల్లో) 339.70 (పరిహారం రూ. కోట్లలో)
2016 – 17 – 8.70 (లబ్ధిదారులు లక్షల్లో) 954.75 (పరిహారం రూ. కోట్లలో)
2017 – 18 – 6.77 (లబ్ధిదారులు లక్షల్లో) 720.60 (పరిహారం రూ. కోట్లలో)
2018 – 19 – 10.00 (లబ్ధిదారులు లక్షల్లో) 1,263.91 (పరిహారం రూ. కోట్లలో) ( ఈ ఏడాది పూర్తిగా చెల్లించలేదు)
వైఎస్ జగన్ ప్రభుత్వంలో చెల్లింపులు
వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిన గత ప్రభుత్వ బకాయిలు 6.19 (లబ్ధిదారులు లక్షల్లో) 715.84 (పరిహారం రూ. కోట్లలో)
2019 – 20 – 9.48 (లబ్ధిదారులు లక్షల్లో) 1,252.18 (పరిహారం రూ. కోట్లలో)
2020 – 21 – 13.00 (లబ్ధిదారులు లక్షల్లో) 1,739.00 (పరిహారం రూ. కోట్లలో)
2021 – 22 – 15.61 (లబ్ధిదారులు లక్షల్లో) 2,977.82 (పరిహారం రూ. కోట్లలో)
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!