రాష్ట్రపతి, ప్రధానికి వైసీపీ ఎంపీల లేఖ.. ఎంపీ రఘురామ కంపెనీలపై ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఇప్పటికే పలు దఫాలుగా లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. ఇక, లోక్సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఆయనకు నోటీసులు కూడా వెళ్లాయి.. అంతటితో ఆగకుండా.. ఇప్పుడు.. రఘురామకు చెందిన కంపెనీపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసారు వైసీపీ ఎంపీలు.. ఇందు భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇందు భారత్ కంపెనీ రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని లేఖలో పేర్కొన్న ఎంపీలు.. తక్షణమే ఇందు భారత్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. అంతేకాకుండా.. కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలన్నారు. మోసం చేసిన మొత్తాన్ని డైరెక్టర్ల నుంచి వసూలు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇందు భారత్ కంపెనీ వేల కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిందని.. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు సరిగా జరగడం లేదని రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఎంపీలు.. దీనివల్ల ప్రజలకు సంస్థల పైన నమ్మకం పోయే ప్రమాదం ఉందన్నారు.. తక్షణమే “ఇందు భారత్”కంపెనీలపై చర్యలు తీసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పిఎఫ్ సి, ఆర్ ఈసి, ఐఐఎఫ్ సిఎల్ నుంచి వేల కోట్ల రూపాయలు పొందారని.. 941.71 కోట్ల రూపాయల ప్రజాధనం స్వాహా చేశారని వారి దృష్టికి తీసుకెళ్లారు.. విద్యుత్ కంపెనీ పేరుతో లోన్లు తీసుకొని నిధులను పక్కదారి పట్టించారు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 63.46 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు… పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను తీవ్రంగా మోసం చేశారు. ఇందు భారత్ పవర్ లిమిటెడ్, ఇందు భారత పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ , ఆర్కయి ఎనర్జీ లిమిటెడ్.. డైరెక్టర్ల పై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక, ఈ కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలి.. వీరు మరో విజయ్ మాల్యాగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!