YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితులపై జగన్ ఆందోళన..
- ఏపీ ఆర్థిక పరిస్థితులపై వైఎస్ జగన్ ఆందోళన..
- ఆదాయాలు లేవు, శరవేగంగా అప్పులు పెరుగుతున్నాయి..
- అప్పులకు తోడు రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగింది: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయాలు లేకపోగా, శరవేగంగా అప్పులు పెరగటంపై జగన్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కాగ్ నివేదికను తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ (ట్వీట్టర్)లో పోస్ట్ చేశాడు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం మరింత అప్పుల్లో కూరుకుపోయింది.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఏర్పడింది.. ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలోనే స్పష్టం చేసింది.. రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేనేలేదు.. రాష్ట్ర విభజనతో మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Read Also: Bharathi Builders: హైదరాబాద్లో మరో ప్రీ-లాంచ్ స్కాం బట్ట బయలు.. అయోమయంలో 250 మంది బాధితులు..!
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ఇక, దీనికి తోడు రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్. ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది.. పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయి.. కొన్ని శాఖల్లోనైతే అత్యంత అధ్వాన్నమైన వృద్దిరేటు కనిపించింది.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో GST ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయి.. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14% మాత్రమే పెరిగింది.. అప్పులు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఏకంగా 15.61% వేగంతో పెరిగాయని వైఎస్ జగన్ తెలిపారు.
Fiscal stress worsens in the first quarter of this financial year
The CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public… pic.twitter.com/0tYnKfNSQi
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!