YS Jagan: కడప జిల్లాలో మూడు రోజుల పాటు వైఎస్ జగన్ పర్యటన!

  • కడప జిల్లాలో మూడు రోజుల పాటు వైఎస్ జగన్ పర్యటన
  • ఇవాళ మధ్యాహ్నం బెంగుళూరు నుంచి పులివెందులకు జగన్
  • ఎల్లుండి ఉదయం 8 గంటలకు బెంగుళూరుకు జగన్
Ys Jagan

Ys Jagan

ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజులు ఉండనున్నారు. ఇవాళ మధ్యాహ్నం బెంగుళూరు నుంచి నేరుగా పులివెందులకు జగన్ చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

Also Read: IND vs SA: పసలేని బ్యాటింగ్‌.. వైట్‌వాష్‌ దిశగా భారత్‌! కుల్దీప్‌లా ఆడుంటే

బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్‌ హాల్‌లో జరిగే వివాహానికి వైఎస్ జగన్ హాజరవుతారు. అక్కడి నుంచి బ్రహ్మణపల్లి చేరుకుని.. అరటి తోటలను పరిశీలించి అక్కడే రైతులతో మాట్లాడతారు. అనంతరం పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్‌ మహేష్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం వేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళతారు. అక్కడి నుంచి పులివెందుల చేరుకుని క్యాంప్‌ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి జగన్ అక్కడి నివాసంలో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి బెంగుళూరుకు జగన్ తిరుగు పయనమవుతారు.