టీడీపీ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంచుతోందని ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి. దొంగ ఓటర్లను తరలిస్తున్నారని ఫిర్యాదు చేసారు. స్థానిక ఎన్నికల్లో టిడిపి అక్రమాలకు పాల్పడుతోంది. చంద్రబాబు పాట్లు చూస్తే జాలి కలుగుతోంది. ఉనికి కోసం నానా రకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఓటుకు ఐదు వేలు నుంచి పదివేలు ఇస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. ఏ కేసులో అయినా 48 గంటల్లో స్టే తీసుకు వస్తానని లోకేష్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. న్యాయస్థానాలను కించపరిచేలా, అగౌరపరిచేలా లోకేష్ మాట్లాడారు. ఎన్నికల కోడ్ ను టీడీపీ ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశాం. చంద్రబాబు పై కేసు నమోదు చేసి.. చర్యలు తీసుకోవాలి. కుప్పం, ఇతర చోట్ల యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. కుప్పంలో కూడా టీడీపీ ఓడిపోవటం ఖాయం అని పేర్కొన్నారు.
టీడీపీ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ…
