NTV Telugu Site icon

స్టైలుగా బీడీ కాల్చిన వైసీపీ ఎమ్మెల్యే

కడప జిల్లా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి బీడీ కాల్చారు. సోమవారం నాడు కమలాపురంలో పురపాలిక ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను అడుగుతూ ముందుకు సాగిపోతుండగా.. ఓ ఇంట్లో బీడీ తయారీ ప్రక్రియను చూసి మంత్రముగ్ధుడయ్యారు. దీంతో కార్మికుడు తయారుచేసిన బీడీ తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. బీడీని అంటించుకుని స్టైలుగా పొగ వదలడంతో అక్కడున్న వైసీపీ నేతలు అవాక్కయ్యారు.

Read Also: రాఘవ లారెన్స్ గొప్ప మనసు.. ‘సినతల్లి’కి ఇల్లు కట్టిస్తానని హామీ

కాగా కష్టపడి పనిచేస్తున్న బీడీ కార్మికులకు ఉత్సాహం ఇచ్చేందుకే తాను బీడీ కాల్చానని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వివరణ ఇచ్చారు. బీడీ కార్మికులను తమ ప్రభుత్వం ఆదుకునేలా తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. అయితే పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని.. అందువల్ల పొగతాగించడం తగ్గించడం ఉత్తమం అని ప్రజలకు సూచించారు. అనంతరం బీడీ కార్మికుల కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని వైసీపీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.