Site icon NTV Telugu

Kurnool: యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి కుటుంబీకులు.. లవ్‌స్టోరీనే కారణమా?

Mantralayam

Mantralayam

ఇటీవల కాలంలో వరుసగా యువతీయువకుల ప్రేమ పలు వివాదాస్పద ఘటనలకు కారణమవుతోంది. తాజాగా ఇలాంటి ఉదంతం మరొకటి వెలుగు చూసింది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఓ ప్రేమజంట ప్రేమించుకున్నారనే కారణంగా వారి కుటుంబాల మధ్య వైరం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రీజ, శివాజీ అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీజ కుటుంబసభ్యులు ఆమెకు మూడురోజుల క్రితం రచ్చమర్రికి చెందిన భీమతో వివాహం జరిపించారు. ఈ పెళ్లి ఇష్టం లేని శ్రీజ తన ప్రియుడు శివాజీతో కలిసి గ్రామం నుంచి వెళ్లిపోయింది. దీంతో శ్రీజ కుటుంబం శివాజీ కుటుంబంపై వైరం పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు శివాజీ ఇంటిపై శ్రీజ కుటుంబసభ్యులు దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో శివాజీ ఇంటిలోని ధాన్యం, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో మాధవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. అయితే తమపై శ్రీజ బంధువులు దాడి చేస్తారన్న భయంతో శివాజీ కుటుంబీకులు పారిపోయినట్లు తెలుస్తోంది.

Exit mobile version