NTV Telugu Site icon

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య…

తిరుపతిలో ప్రియుడి ప్రేమ కోసం భర్త హత్యను చేసింది భార్య. చిత్తూరు కలెక్టర్ కార్యాలయ అటెండర్ “వాసు”ను చంపింది తన భార్య. వాసును అత్యంత దారుణంగా హత్య చేసిన భార్య స్వప్నప్రియా… తలను కోడిమెడ విరిచినట్లు విరిచేసింది. కానీ తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపింది. కానీ మెడపై గాయాలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు కుమారుడు. ఏ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం బాడీని ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదికలో మెడ ఎముకలు విరిగినట్లు నిర్దారణ అయ్యింది. అయితే వివాహేతర సంబంధమే హత్యకు కారణమంటున్నారు గ్రామస్తులు. చంద్రగిరి (మం) అరిగెలవారిపల్లెలో స్వప్నప్రియను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.