Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today 1280

Whats Today 1280

* నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. బర్దిపూర్ లో 687 కోట్ల తో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న సీఎం.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం రేవంత్.. ముఖ్యమంత్రి పర్యటనకు 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు..

* నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ.. విచారణ చేయనున్న జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం.. ఇప్పటికే స్పీకర్ కి చాలా సమయం ఇచ్చామని స్పష్టం చేసిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారాన్ని తెలపాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు..

* నేడు మంచిర్యాల జిల్లాలో మాజీమంత్రి హరీష్ రావు పర్యటన.. క్యాతన్‌పల్లి, బెల్లంపల్లిలో పార్టీ నేతలతో కీలక సమావేశం..

* నేడు నర్సాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు పర్యటన.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న తెలంగాణ బీజేపీ చీఫ్..

* నేడు ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో సీఎం చంద్రబాబు పర్యటన.. గ్రామ సభ, పంట పొలాలను సందర్శించనున్న సీఎం చంద్రబాబు.. ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు..

* నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి నారా లోకేష్.. పార్టీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ.. రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై ముఖ్య నాయకులతో సమావేశం..

* నేడు నంద్యాల జిల్లాలోని బనగానపల్లె మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలపై సమీక్ష సమావేశం.. పాల్గొననున్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..

* నేడు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన.. మాజీమంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న జగన్.. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్.. వైఎస్ జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు.. ట్రాఫిక్ కారణంగా రూట్ మ్యాప్ మార్చాలంటూ నోటీసులు.. వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లాలని సూచన..

* నేడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి..

* నేడు ఏపీ లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ.. నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై విచారణ..

* నేడు జోగి బ్రదర్స్ బెయిల్ రద్దుపై ఏసీబీ కోర్టులో విచారణ.. నకిలీ మద్యం కేసులో జోగి సోదరుల బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్..

* నేడు రమేశ్ పై నమోదైన కేసులు క్వాష్ చేయాలని పిటిషన్.. విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.. తిరుపతి, ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ పై కేసులు నమోదు..

* నేడు ఉదయం 10: 18 గంటలకు టీటీడీ ఈవోగా రవిచంద్ర బాధ్యతలు.. సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు..

* నేటి నుంచి అన్నవరంలోని కోటి తులసి పత్రి పూజ.. ఈనెల 15 వరకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, నక్షత్ర జపాలు..

* నేటి నుంచి మూడు రోజులపాటు పొన్నాడ బంగారు పాప ఉరుసు ఉత్సవాలు.. బంగారు పాపను కలిసి దర్శించుకోనున్న హిందూ ముస్లిం భక్తులు.. ఆఖరి రోజు గంథోత్సవంలో భాగంగా పోటా పోటీగా గంధాన్ని పూసుకోవడం ప్రత్యేకత..

* నేడు అండర్-19 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. భారత్- ఇంగ్లాండ్ మధ్య మధ్యాహ్నం ఒంటి గంటకు ఫైనల్ మ్యాచ్.. ఐదుసార్లు అండర్-19 వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమిండియా.. ఇప్పటికే 10 సార్లు ఫైనల్ చేరిన భారత జట్టు..

Exit mobile version